నాగ్- అమల-అఖిల్.. వచ్చారు వచ్చారు

Update: 2017-03-29 17:03 GMT
గత కొన్ని నెలలుగా శుభకార్యాలు.. సినిమా వేడుకల హడావిడిలో ఫుల్ బిజీగా ఉన్న అక్కినేని నాగార్జున.. కొన్ని వారాలుగా పబ్లిక్ అపియరెన్స్ మాత్రం ఇవ్వలేదు. అఖిల్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ కావడంతో.. నాగ్ బాగా డిప్రెషన్ ఫీలయ్యారనే టాక్ కూడా వినిపించింది. బ్యాక్ టు బిజినెస్ అంటూ రాజు గారి గది2 షూటింగ్ మొదలుపెట్టేసిన నాగ్.. ఇప్పుడు భార్యా సమేతంగా మళ్లీ జనాల ముందుకు వచ్చేస్తున్నారు.

ప్రస్తుతం హైద్రాబాద్ లో జరుగుతున్న ఐఫా వేడుకల కోసం.. నాగార్జున-అమల ఇద్దరూ కలిసి హాజరయ్యారు. ఈ వేడుకలకు వెళుతూ.. భార్య అమలతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు నాగ్. నవ మన్మధుడు అని తనను ఎందుకు అనాలో మరోసారి చెప్పకనే చెప్పాడు నాగార్జున. ఇక భర్తకి తగిన భార్యగా.. అమల కూడా భలే మెరిసిపోతోంది. మరోవైపు.. ఈ ఐఫా వేడుకల్లో మరో ప్రత్యేకతగా అఖిల్ నిలుస్తున్నాడు.

డిజైనర్ వేర్ కుర్తా పైజమాలో ఈ వేడుకల్లో సందడి చేసిన అఖిల్.. మన్మధుడికి అసలు సిసలైన వారుసుడిగా మెరిసిపోతున్నారు. అఖిల్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన తర్వాత.. ఇప్పటివరకూ నాగ్-అమల-అఖిల్ లు పబ్లిక్ గా కనిపించిన సందర్భం లేదు. కానీ ఒకేసారి ఒకే వేడుకలో అందరూ హంగామా చేయడం ఆకట్టుకుంటోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News