'అఖిల్‌-క‌ర‌ణ్ జోహార్' గుట్టు లీక్‌

Update: 2018-09-24 08:00 GMT
అక్కినేని మిసైల్ అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్ప‌టికే మూడేళ్ల‌యింది. 11 న‌వంబ‌ర్ 2015 `అఖిల్` రిలీజ్ తేదీ. వాస్త‌వానికి ఆ సినిమా రిలీజ్ కాక‌ముందే అత‌డిని బాలీవుడ్‌ కి ప‌రిచ‌యం చేసేందుకు ఒక బిగ్ షాట్ అక్క‌డి నుంచి నాగార్జున‌కు ఫోన్ చేశారు. ఆయ‌నెవ‌రో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నేలేదు. అక్కినేని కుటుంబానికి ఎంతో స‌న్నిహితుడు అయిన స్టార్ ప్రొడ్యూస‌ర్ కం డైరెక్ట‌ర్ క‌ర‌ణ్ జోహార్. అత‌డు కేవ‌లం బాలీవుడ్ కిడ్స్‌ నే కాదు - ఇటు టాలీవుడ్‌ లోనూ ప‌లువురిని బాలీవుడ్‌ కి ప‌రిచ‌యం చేసేందుకు ప్ర‌య‌త్నించారు. అందులో ముఖ్యంగా కింగ్ నాగార్జున వార‌సుడిని బాలీవుడ్‌ కి ప‌రిచ‌యం చేయాల‌ని ఎంత‌గానో ట్రై చేశారు.

ఇదే విష‌యంపై కింగ్ నాగార్జున‌నే క్లారిటీ ఇచ్చారు. అఖిల్ బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు? అన్న ప్ర‌శ్న‌కు.. ఆయ‌న చెప్పిన మాట అంతే పెద్ద షాకిచ్చింది. అఖిల్ బాలీవుడ్ ఎంట్రీకి తానే అడ్డంకి అని నాగార్జున చెప్పారు. ``అక్కినేని అఖిల్‌ ని బాలీవుడ్‌ లో ప‌రిచయం చేసేందుకు క‌ర‌ణ్ జోహార్ చాలా సార్లు ట్రై చేశారు. కానీ అందుకు బ్రేక్ వేసింది నేనే. క‌ర‌ణ్ జోహార్‌ కి అఖిల్ అంటే ఎంతో ఇష్టం. అందుకే బాలీవుడ్‌ లో ప‌రిచ‌యం చేస్తాన‌ని ఇప్ప‌టికే నాలుగు సార్లు అడిగినా - నేనే వ‌ద్ద‌న్నాను. అఖిల్ న‌టుడిగా ఇంకా కిడ్. చాలా నేర్చుకోవాల్సి ఉంది. అదే విష‌యం క‌ర‌ణ్‌ కి చెప్పాను`` అని అన్నారు.

అంతేకాదు అఖిల్ డెబ్యూ ప్ర‌య‌త్నం ఫెయిల‌వ్వ‌డంపైనా కింగ్ త‌నంత‌ట తానుగానే సెటైర్ వేశారు. ``అఖిల్ ఆల్రెడీ తెలుగులో తిన్నాడు.. అందుకే పెద్దోళ్ల మాట వింటున్నాడు. అది కూడా క‌ర‌ణ్‌ కి చెప్పాను`` అని అన్నారు.
క‌ర‌ణ్‌ తో అఖిల్ ఎంతో స్నేహంగా ఉంటాడు. ఆ ఇద్ద‌రూ క్లోజ్ బ‌డ్డీస్.. క‌లిసి బాలీవుడ్‌ సినిమా చేసేందుకు టైమ్ ప‌డుతుంద‌ని అన్నారు. అయితే అందుకు ఇంకా ఎంత టైమ్ ప‌డుతుందో మాత్రం చెప్ప‌లేదు. ముందు అఖిల్ కెరీర్ టాలీవుడ్‌ లో టేకాఫ్ అవ్వాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం అఖిల్ న‌టిస్తున్న మూడ‌వ‌ చిత్రం `మిస్ట‌ర్ మ‌జ్ను`పై పూర్తి కాన్ఫిడెన్స్‌ ని నాగార్జున వ్య‌క్తం చేశారు. `మిస్ట‌ర్ మ‌జ్ను` టీజ‌ర్ కిక్కిచ్చింది. అఖిల్ ఇప్ప‌టికి నా బ్రాండ్‌ కి వ‌చ్చేశాడు. వెంకీ అట్లూరి అద్భుత‌మైన విజువ‌ల్స్‌ ని క్రియేట్ చేశాడు.. అంటూ నాగార్జున‌ కితాబిచ్చారు. అదీ సంగ‌తి.
   

Tags:    

Similar News