అత్త‌గారిపై న‌మ్ర‌త ఘ‌ట్ట‌మ‌నేని హృద‌య సందేశం

Update: 2022-10-10 04:10 GMT
సూప‌ర్ స్టార్ కృష్ణ స‌తీమ‌ణి.. మ‌హేష్ త‌ల్లి గారైన ఇందిరాదేవి అకాల మరణంతో ఘట్టమనేని కుటుంబం క‌ష్ట‌కాలంలో ఉంది. ఈ శూన్యం నుండి కుటుంబం ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కోలుకుంటుంది. ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ తన ఇన్ స్టాగ్రామ్ లో అందమైన కుటుంబ ఫోటోని పంచుకున్నారు. తన మామగారైన కృష్ణగారి పట్ల ప్రేమాభిమానాలను వ్యక్తం చేస్తూ.. త‌న అత్త‌గారు స్వర్గీయ ఇందిరాదేవి గారు ఎప్ప‌టికీ తమ హృదయాల్లో నిలిచి ఉంటారని తెలిపారు.

ఇందిరా దేవి గారు కుటుంబాన్ని రక్షిస్తారని నమ్రత తన అత్తగారిపై ఉన్న అభిమానాన్ని వర్ణించింది. ఈ అందమైన కుటుంబ చిత్రం ఇంటర్నెట్ లో సునామీగా మారింది. అభిమానులు సూపర్ స్టార్ కుటుంబంపై తమ ప్రేమను వ్య‌క్త‌ప‌రుస్తున్నారు. ఇందిరాదేవి గారి మృతికి సానుభూతిని వ్య‌క్తం చేస్తూనే ఉన్నారు.

నమ్రత శిరోద్కర్ లేఖ సారాంశ‌మిదీ.."పెద్ద‌లు చెప్పినట్లు జీవితం పూర్తి వృత్తం (లైఫ్ సర్కిల్ చుట్టి వ‌స్తుంది) అవుతుంది...  ఇది ఇప్పుడు నా జీవిత వృత్తం! లవ్ యూ మామయ్య గారూ.. మీరు ఒక బాధ్య‌త‌. మా జీవితంలో మిమ్మల్ని కలిగి ఉన్నందుకు మేము ఆశీర్వాదం పొందాము.. మమ్మీ (ఇందిరాదేవి గారు) సాధారణంగా ఈ కుటుంబ చట్రంలో ఉంటుందని నాకు తెలుసు కానీ.. ఎప్ప‌టికీ మా హృదయాలలో జీవించి ఉంటుంది. మేము ఉంటాము..

మేము ప్రపంచం ఈ వైపు ఉండే వరకు ప్రతిరోజూ మిమ్మ‌ల్ని స్మ‌రిస్తూనే ఉంటాం. ఆమె ఇక్కడ మా కుటుంబాన్ని కాపాడుతుందని మాకు తెలుసు.. ప్రేమ ప్రేమ .. మీకు మరింత ప్రేమ మమ్మీ..!! అంటూ ల‌వ్ ఈమోజీల‌ను షేర్ చేసారు. న‌మ్ర‌త లేఖ ఆద్యంతం పోయెటిక్ గా స్పందించి హృద‌యాల‌ను ట‌చ్ చేసారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News