SSMB28 - Thalapathy66 రూమర్స్ పై నాని క్లారిటీ..!

Update: 2022-06-06 10:34 GMT
వరుస సినిమాలతో ఏడాది పొడవునా బిజీగా ఉండే టాలీవుడ్ హీరోలలో నేచురల్ స్టార్ నాని ఒకరు. ఇప్పుడు 'అంటే.. సుందరానికీ!' వంటి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ తో వస్తోన్న నాని.. తన కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా 'దసరా' షూటింగ్ లో పాల్గొంటున్నారు. అయితే గత కొన్ని రోజులుగా నాని తదుపరి ప్రాజెక్ట్స్ గురించి పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కనున్న సినిమాలో నాని ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు టాక్ వచ్చింది. అలానే 'కేజీయఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ తో ఓ మూవీ చేయబోతున్నారని చెప్పుకున్నారు. అలానే తమిళ హీరో విజయ్ తెలుగు డెబ్యూ #తలపతి66లోనూ ఓ రోల్ చేసే అవకాశం ఉందంటూ రూమర్స్ వినిపించాయి.

తాజాగా 'అంటే.. సుందరానికీ' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన నాని.. తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి వస్తోన్న పుకార్లపై స్పందించారు. #Thalapathy66 - #SSMB28 మరియు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమా చేస్తున్నానని వార్తల్లో నిజం లేదనిక్లారిటీ ఇచ్చారు. అసలు ఈ వార్తలు ఎలా వస్తున్నాయో తెలియదని అన్నారు.

అలానే ఇంకా నాని తన 30వ చిత్రాన్ని అంగీకరించలేదని తెలిపారు. ప్రస్తుతం 'దసరా' సినిమాపై దృష్టి సారిస్తున్నానని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాతే ఓ ప్రత్యేక సందర్భంలో #Nani30 చిత్రాన్ని ప్రకటిస్తామని హీరో స్పష్టం చేశారు. దీంతో ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్న రూమర్లకు చెక్ పడినట్లు అయింది.

ఇకపోతే నాని - నజ్రిమా నజీమ్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన 'అంటే సుందరానికి' సినిమా.. ఇప్పటికే అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కు రెడీ అయింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందిన ఈ చిత్రాన్ని జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు తమిళ మలయాళ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

నాని కెరీర్ లో వస్తోన్న 29వ చిత్రం 'దసరా'. ఇది హీరోకి ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.
Tags:    

Similar News