పైసా ఖ‌ర్చు లేకుండా న‌య‌న్ దంప‌తుల హనీమూన్ ట్రిప్‌?!

Update: 2022-08-27 09:30 GMT
సౌత్ లో లేడీ సూప‌ర్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న న‌య‌న‌తార ఇటీవ‌లె వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. కోలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత విఘ్నేష్ శివ‌న్ తో న‌య‌న్ ఏడడుగులు న‌డిచింది. దాదాపు ఏడేళ్ల నుంచీ ప్రేమించుకుంటున్న ఈ జంట‌..

ఫైన‌ల్ గా జూన్ 9న మహాబలిపురంలోని ఓ రిసార్ట్ లో కుటుంబ‌స‌భ్యులు, స‌న్నిహితుల న‌డుమ అంగరంగ వైభ‌వంగా వివాహం చేసుకున్నారు. బాలీవుడ్‌, కోలీవుడ్ సెల‌బ్రెటీలు సైతం వీరి పెళ్లిలో సంద‌డి చేశారు.

అయితే పెళ్లైన కొద్ది రోజుల‌కే షూటింగ్స్ తో బిజీ అయిపోయిన ఈ ల‌వ‌బుల్ క‌పుల్‌.. రీసెంట్ గా కాస్త బ్రేక్ తీసుకుని హ‌నీమూన్ కోసం స్పెయిన్ చెక్కేశారు. అక్క‌డ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే నడి వీధుల్లో రొమాంటిక్ పోజులు ఇస్తూ ఫోటో షూట్లు చేయించుకుంటున్నారు. అందుకు సంబంధించిన పిక్స్ ను విఘ్నేష్ త‌ర‌చూ షేర్ చేస్తుండ‌టంతో.. అవి కాస్త తెగ వైర‌ల్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే.. న‌య‌న్ దంప‌తుల హ‌నీమూన్ ట్రిప్ కు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. అదేంటంటే.. న‌య‌న్‌- విఘ్నేష్ లు త‌మ హ‌నీమూన్ ట్రిప్ కోసం పైసా కూడా ఖ‌ర్చు పెట్ట‌డం లేద‌ట‌. ఈ జంటకు ఒక ప్రముఖ సంస్థ స్పాన్సర్‌ చేస్తోందని, ఫలితంగానే ఈ జంట స్పెయిన్ లో సేద తీరుతోంద‌ని టాక్ న‌డుస్తోంది.

అంతేకాదు, వీరు ఉండే హోటల్‌ రూమ్ రెంట్ ఒక రోజుకే రూ. 2.5 లక్షలు ఉంటుంద‌ట‌. అలాగే న‌య‌న్ దంప‌తుల ఇతర ఖర్చులను సైతం స‌ద‌రు సంస్థనే భ‌రిస్తుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చారం ఎంత నిజ‌మో వారికే తెలియాలి. ఇక న‌య‌న్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. తెలుగులో ఈ భామ 'గాడ్ ఫాద‌ర్‌' చిత్రంలో న‌టిస్తోంది. మలయాళంలో హిట్టైన 'లూసిఫర్'కు ఇది రీమేక్‌.

మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తున్నారు. ఆయ‌న సోద‌రిగా న‌య‌న్ క‌నిపించ‌బోతోంది. అలాగే మ‌రోవైపు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌, డైరెక్ట‌ర్ అట్లీ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకుంటున్న 'జవాన్‌' చిత్రంలోనూ న‌య‌న్ న‌టిస్తోంది. ఇదే ఆమె తొలి బాలీవుడ్ చిత్రం కావ‌డం విశేషం.
Tags:    

Similar News