రాయుడు రిపీట్ అవుతుందా?

Update: 2017-10-01 06:25 GMT
టాలీవుడ్ లో మలయాళం భామలకు ఇప్పుడు ఛాన్సులు భాగనే వస్తున్నాయి. అక్కడ ఓ రెండు హిట్స్ అందుకుంటే చాలు నెక్స్ట్ టాలీవుడ్ నుంచి ఆఫర్స్ అందుకుంటున్నారు. రీసెంట్ గా అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన మెడ మీద అబ్బాయి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన మలయాళీ భామ నిఖిలా విమల్. మలయాళం రీమేక్ గా వచ్చిన ఆ సినిమా ఒరిజినల్ కథలో కూడా ఆమెనే నటించింది.

అయితే ఇప్పుడు మరో మంచి ఛాన్స్ ను దక్కించుకుంది. సీనియర్ నటుడు మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో నిఖిలా మోహన్ బాబు కూతురిగా కనిపించనుందట. గతంలో మోహన్ బాబు 'రాయుడు' సినిమా తండ్రి కుతుళ్ల ఆప్యాయత నేపధ్యంలో వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఇప్పుడు అదే స్థాయిలో మరో సారి తండ్రి కూతుళ్ళ మధ్య ఉండే రిలేషన్ ని చూపించనున్నారట. పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఆ సినిమా తెరకెక్కనుందట. అయితే ఇంకా నిఖిలాను ఫైనల్ చేయలేదని తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం మోహన్ బాబు రాజకీయ నేపద్యంలో ఉండే గాయత్రి సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమాను మదన్ తెరకెక్కిస్తున్నాడు. ఈ దర్శకుడు అప్పట్లో పెళ్ళైన కొత్తలో సినిమాను తెరకెక్కించి  గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ నలుగురు వంటి మంచి కథను  అందించింది కూడా ఈ దర్శకుడే. అయితే ఈ సారి మోహన్ బాబుతో మంచి హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తిరుపతి పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుపుకుంటోంది. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.



Tags:    

Similar News