పవన్ 'జల్సా' రీ రిలీజ్‌ ఇంట్రెస్టింగ్‌ విషయాలు

Update: 2022-08-31 17:30 GMT
టాలీవుడ్‌ స్టార్‌ హీరోల అభిమానులు తమ అభిమాన హీరో పుట్టిన రోజు సందర్భంగా భారీ ఎత్తున ఆ హీరో నటించిన పాత సినిమాలను రీ రిలీజ్ చేయిస్తున్నారు. మహేష్‌ బాబు పోకిరి సినిమా ని ఆయన పుట్టిన రోజు సందర్భంగా అత్యధిక స్క్రీన్స్ ల్లో రీ రిలీజ్ చేసిన విషయం తెల్సిందే. రీ రిలీజ్ లో ఏ ఇండియన్ సినిమా కు దక్కని అరుదైన ఘనత పోకిరి కి దక్కింది.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు అంతకు మించి అన్నట్లుగా జల్సా సినిమాను రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే 500 స్క్రీన్స్ ల్లో రీ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి. సెప్టెంబర్‌ 2వ తారీకు వరకు ఆ సంఖ్య 750 కి పెరిగినా ఆశ్చర్యం లేదు అంటూ పవన్ అభిమానులు చెబుతున్నారు. భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న జల్సా సినిమా యొక్క అడ్వాన్స్ బుకింగ్‌ అదే స్థాయిలో ఉంది.

జల్సా సినిమా ని త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన విషయం తెల్సిందే. ఇలియానా హీరోయిన్ గా నటించగా ప్రకాష్‌ రాజ్ కీలక పాత్రలో కనిపించాడు. కమలిని ముఖర్జీ సినిమాలో గెస్ట్‌ రోల్‌ లో కనిపించింది. సినిమాలో కామెడీతో పాటు ఎమోషన్‌ ఓ రేంజ్ లో ఉంటుంది. ముఖ్యంగా పవన్ మరియు బ్రహ్మీ మధ్య ఉండే కామెడీ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.

ఇప్పుడు జల్సా సినిమా గురించి చాలా మందికి తెలియదు. పవన్‌ అభిమానులు కొందరు అప్పట్లో జల్సా సినిమాను థియేటర్ లో చూసి కూడా ఉండరు. అందుకే ఇప్పుడు రీ రిలీజ్ నేపథ్యంలో అత్యధికులు జల్సా సినిమాను తెలుగు ప్రేక్షకులు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పవన్‌ కెరీర్‌ లోనే బిగ్గెస్ట్‌ సినిమాల్లో జల్సా సినిమా ఒకటి.

ఆ సినిమాకు సూపర్ స్టార్‌ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో సినిమా స్థాయి అప్పట్లో మరింతగా పెరింది. ఒక స్టార్‌ హీరో సినిమాకు సూపర్ స్టార్‌ వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడంతో అప్పటి నుండి ఆ వాయిస్‌ ఓవర్‌ పద్దతి కంటిన్యూ అవుతోంది. పవన్‌ జల్సా సినిమా రీ రిలీజ్ లో అత్యధిక వసూళ్లు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ ఇండియన్ సినిమా కు దక్కని అత్యధిక రీ రిలీజ్ ఘనత జల్సా కు దక్కబోతుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు
Tags:    

Similar News