ప‌వ‌న్ కూడా సెంటిమెంట్ బాట ప‌ట్టాడే!

Update: 2017-04-05 07:05 GMT
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ స్టైలే వేరుగా ఉంటుంది. ఇత‌ర టాలీవుడ్ హీరోల‌కు భిన్నంగా వ్య‌వ‌హ‌రించే ప‌వ‌న్ అస‌లు సెంటిమెంట్ల‌కు, మూఢ న‌మ్మ‌కాల‌కు అంత‌గా విలువ ఇవ్వ‌ర‌న్న విష‌యం మ‌న‌కు తెలిసిందే. అయితే వ‌రుస చిత్రాల ఆప‌జ‌యంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా సెంటిమెంటు బాట ప‌ట్ట‌క త‌ప్ప‌లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌ - కాట‌మ‌రాయుడు డిజాస్ట‌ర్ల‌తో ప‌వ‌న్ సెంటిమెంటు బాట ప‌ట్టేశార‌ని సినీ జ‌నాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఇక అస‌లు విష‌యంలోకి వ‌స్తే... ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ల్యాణ్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రంలో న‌టిస్తున్నాడు. ముందుగా నిర్ణ‌యించుకున్న షెడ్యూల్ ప్ర‌కారం ఈ చిత్రం ఆగ‌స్టులో ప్రేక్ష‌కుల ముందుకు రావాల్సి ఉంది. అయితే ఓ నెల ఆల‌స్యంగా సెప్టెంబ‌ర్‌ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాల‌ని ప‌వ‌న్ భావిస్తున్నార‌ట‌. ఈ చిత్రం రిలీజ్‌ ను నెల ఆల‌స్యంగా చేయ‌డానికి ప‌క్కా సెంటిమెంటే కార‌ణ‌మ‌న్న వాద‌న వినిపిస్తోంది.

 గ‌తంలో ప‌వ‌న్‌ - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌ లో వ‌చ్చిన అత్తారింటికి దారేది చిత్రం సెప్టెంబ‌ర్‌ లోనే రిలీజైంది. ఆ చిత్రం ప‌వ‌న్ కెరీర్‌ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్‌ గా నిలిచింది. అత్తారింటికి దారేది త‌ర‌హా హిట్ కావాల‌న్న కాంక్ష‌తోనే ప‌వ‌న్ త‌న తాజా చిత్రాన్ని ఆగ‌స్టులో కాకుండా సెప్టెంబ‌ర్‌ లో రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. సెప్టెంబ‌రు నెలలో అత్తారింటికి దారేది చిత్రం రిలీజే కాకుండా... ఆ చిత్రానికి, ఇప్పుడు తాజాగా తెర‌కెక్కుతున్న చిత్రానికి కూడా త్రివిక్రమే ద‌ర్శ‌కుడు కావ‌డం కూడా ఈ సెంటిమెంటుకు బ‌లం చేకూరింద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి.

అయినా ఈ చిత్రానికే ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇలా సెంటిమెంటును ఎందుకు ఆపాదిస్తున్నార‌డానికి మ‌రో కార‌ణం కూడా లేక‌పోలేదండోయ్‌... అదేంటంటే... ప‌వ‌న్ కెరీర్‌ లో ఈ తాజా చిత్రం 25వ చిత్రంగా రికార్డుల‌కెక్క‌కుంది. త‌న 25వ చిత్రాన్ని బ్లాక్ బ‌స్ట‌ర్‌ గా మల‌చుకునేందుకే ప‌వ‌న్ ఈ చిత్రానికి ఎన్న‌డూ లేని విధంగా సెంటిమెంటును జోడిస్తున్నాడు. చూద్దాం... ప‌వ‌న్ సెంటిమెంటు ఎంత‌వ‌ర‌కు వ‌ర్క‌వుట‌వుతుందో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News