మేనల్లుడి సినిమాలో పవర్ స్టార్...?

Update: 2020-09-17 17:35 GMT
మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి కష్టపడుతున్నాడు. ఈ క్రమంలో వరుస సినిమాలను లైన్లో పెడుతూ దూకుడు చూపిస్తున్నాడు. ఇప్పటికే 'సోలో బ్రతుకే సో బెటర్‌' సినిమాని కంప్లీట్ చేసిన తేజ్.. 'ప్రస్థానం' దేవకట్టా దర్శకత్వంలో ఓ సినిమా స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ చేతులు మీదుగా లాంఛ‌నంగా ప్రారంభ‌మైన ఈ చిత్రాన్ని జె.బి.ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌ పై జె.భగవాన్ - జె.పుల్లారావు నిర్మించనున్నారు. ఈ సినిమాలో తేజ్ ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నారని.. అతని క్యారెక్టర్ చాలా భిన్నంగా ఉంటుందని.. ఇప్పటి వరకు తేజ్ కెరీర్లో ట్రై చేయని జోనర్ అని వార్తలు వస్తున్నాయి. అయితే నటుడిగా మెగా మేనల్లుడిని మరో స్థాయికి తీసుకుపోయే ఈ సినిమాలో మామ పవన్ కళ్యాణ్ కూడా నటించబోతున్నాడని ఓ ర్యూమర్ స్ప్రెడ్ అవుతోంది.

కాగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో అన్న మెగాస్టార్ చిరంజీవి నటించిన 'శంకర్ దాదా ఎంబీబీఎస్' 'శంకర్ దాదా జిందాబాద్' సినిమాల్లో స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పొలిటికల్ థ్రిల్లర్ గా వస్తున్న సాయి ధరమ్ తేజ్ సినిమాలో కూడా పవన్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడని వార్తలు వస్తున్నాయి. గతంలో డైరెక్టర్ దేవాకట్టా ముందుగా 'ఆటో నగర్ సూర్య' స్టోరీ పవన్ కళ్యాణ్ కే చెప్పాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేవాకట్టా తేజ్ సినిమాలో స్పెషల్ రోల్ కోసం సంప్రదించారట. మరి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు ఓకే చేస్తున్న పవన్.. మేనల్లుడి సినిమాలో వీలు చూసుకొని నటిస్తాడేమో చూడాలి.
Tags:    

Similar News