‘అత్తారింటికి దారేదీ’ రిపీట్ అవుతుందా?

Update: 2021-06-25 06:30 GMT
టాలీవుడ్లో తెర‌కెక్కు‌తున్న మోస్ట్ క్రేజీ ప్రాజెక్టుల‌లో ‘అయ్య‌ప్ప‌నుమ్ కోషియం’ రీమేక్ ఒకటి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - భళ్లాల దేవ రానా కాంబినేష‌న్లో రూపొందుతున్న ఈ మూవీపై అంచ‌నాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. పవన్ కమ్ బ్యాక్ మూవీ ‘వ‌కీల్ సాబ్’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో.. ఈ సినిమాపై అంచ‌నాలు అమాంతం పెరిగిపోయాయి.

ఈ చిత్రంలో బిజు మీనన్ పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కనిపించనున్నారు. మరో హీరో పృథ్వీరాజ్‌ క్యారెక్టర్ లో ప్రతినాయకుడిగా రానా న‌టిస్తున్నారు. వీరిద్ద‌రూ ఢీకొనే స‌న్నివేశాల కోసం ఫ్యాన్స్ ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు. క‌రోనాతో పాజ్ ఇచ్చిన‌ షూట్ ను రెజ్యూమ్ చేసేందుకు యూనిట్ సిద్ధ‌మ‌వుతోంది.

అయితే.. ఈ సినిమాకు సంబంధించిన ప్ర‌ధాన స‌మ‌స్య ఒక‌టి ఇంకా అలాగే కంటిన్యూ అవుతోంది. అదే.. ప‌వ‌న్ జోడీ. ఈ చిత్రంలో ప‌వన్ స‌ర‌స‌న ఎవ‌రిని సెల‌క్ట్ చేయాల‌నేది యూనిట్ కు స‌మ‌స్య‌గా మారిపోయింది. సాయి ప‌ల్ల‌విని అనుకున్నా కుద‌ర‌లేదు. ఆ త‌ర్వాత వేట మొద‌లు పెట్టిన యూనిట్‌..
నిత్యామీన‌న్ ను ఫైన‌ల్ చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది.

లేటెస్ట్ అప్డేట్ ఏమంటే.. నిత్యా కూడా ఇంకా ఫైన‌ల్ కాలేద‌ని తెలుస్తోంది. ‘అత్తారింటికి దారేది’తో హిట్ పెయిర్ గా నిలిచిన సమంతను తీసుకోవాలని చూస్తున్నారట. ఈ మేర‌కు యూనిట్ సీరియ‌స్ గానే ఆలోచిస్తోంద‌ట‌. మ‌రి, ఏమ‌వుతుంద‌న్న‌ది చూడాలి. రానా స‌ర‌స‌న త‌మిళ్ బ్యూటీ ఐశ్వ‌ర్య రాజేష్ క‌న్ఫామ్ అయిన సంగ‌తి తెలిసిందే.

ఈ క్రేజీ మల్టీస్టారర్ కు.. యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. మాటలు, స్క్రీన్ ప్లే బాధ్యతను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తీసుకున్నారు. సీతార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థ‌మన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Tags:    

Similar News