న‌ట‌వార‌సుల‌కేనా బుట్ట‌బొమ్మ‌కు ఛాయిస్ ఉంది!

Update: 2022-06-17 10:30 GMT
కియరా అద్వాణీ- జాన్వీ క‌పూర్- అన‌న్య పాండే లాంటి యువ క‌థానాయిక‌లు క‌ర‌ణ్ జోహార్ అండ‌దండ‌ల‌తో స్టార్లుగా ఎదిగేస్తున్న సంగ‌తి తెలిసిందే. అటు బాలీవుడ్ నుంచి ఇటు టాలీవుడ్ వ‌ర‌కూ స‌ద‌రు భామ‌ల‌కు అవ‌కాశాలు క‌ల్పించేందుకు క‌ర‌ణ్ కి చెందిన ఏజెన్సీ కార్నర్ స్టోన్ (DCA) చాలా హార్డ్ వ‌ర్క్ చేస్తోంది. ఇటీవ‌ల ప్రారంభించిన‌ కార్న‌ర్ స్టోన్ క్యాంప్ లో చాలా మంది మోడ‌ల్స్ న‌టీన‌టులుగా ఎదిగేందుకు చేరుతున్న సంగ‌తి తెలిసిందే. కాస్టింగ్ - ఈవెంట్ మేనేజెమెంట్-ట్యాలెంట్ మేనేజ్ మెంట్ ఇలా అన్ని విభాగాల్లోనూ కార్న‌ర్ స్టోన్ - డీసీఏ వ‌ర్క్ చేస్తోంది. బాలీవుడ్ లో మ్యాట్రిక్స్ - స్పైస్ - వైఆర్ య‌ఫ్ లాంటి పీఆర్ ఏజెన్సీల‌కు పోటీగా డీసీఏ ఇప్పుడు ఎదిగేస్తోంది.

తాజా స‌మాచారం మేర‌కు అందాల పూజా హెగ్డే కూడా క‌ర‌ణ్ కి చెందిన స‌ద‌రు ఏజెన్సీలో చేరింది. ఆ మేర‌కు అధికారికంగా కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ - కార్నర్ స్టోన్ (DCA) అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌రించాయి.

సంస్థ అధికారిక ట్విట్టర్ వివ‌రాల ప్ర‌కారం... పూజా DCA కుటుంబంలో చేరారు. మొహెంజో దారో- అల‌ వైకుంఠపురములో-బీస్ట్ చిత్రాల‌ స్టార్ తదుప‌రి రోహిత్ శెట్టి #సర్కస్ లో రణ్‌వీర్ సింగ్ సరసన .. కభీ ఈద్ కబీ దీపావళిలో సల్మాన్ ఖాన్ సరసన నటించనున్నారు'' అని వెల్ల‌డించారు.

పూజా హెగ్డే కొంత కాలం పాటు బ్యాక్ టు బ్యాక్ బాలీవుడ్ ప్రాజెక్ట్ లతో బిజీ అవుతోంది. అదే క్ర‌మంలో కొత్తగా తెలుగు తమిళ చిత్రాల‌కు  సంత‌కాలు చేయ‌డం లేదు. కొన్నాళ్లుగా స‌ల్మాన్ భాయ్ ప్రాజెక్ట్ పైనా.. రోహిత్ శెట్టి స‌ర్క‌స్ పైనా పూజా చ‌ర్చ‌లు జ‌రుపుతోంది. తాజాగా ఈ రెండు ప్రాజెక్టులు అధికారికంగా ఖాయ‌మ‌య్యాయి.

క‌ర‌ణ్ డీసీఏ కుటుంబానికి స్వాగతం చెబుతూ.. ''పూజా హెగ్డే మాతో కలిసి కొన్ని అద్భుతమైన సినిమాల్లో న‌టిస్తుంది'' అని వెల్ల‌డించ‌గా.. ధర్మ కార్నర్ స్టోన్ ఏజెన్సీ కి ధ‌న్య‌వాదాలు చెబుతూ పూజ ఆనందం వ్య‌క్తం చేసింది. ధర్మ కార్నర్ స్టోన్ ఏజెన్సీలో భాగమైనందుకు థ్రిల్లింగ్ గా ఉన్న పూజా కరణ్ సందేశాన్ని మళ్లీ షేర్ చేసి ..''అవును... మునుముందు మ‌రింత‌గా అద్భుతమైన విషయాలు మాత్రమే చూస్తారు'' అని అన్నారు.

డిసెంబర్ 2020లో ప్రారంభించిన‌ ధర్మ కార్నర్ స్టోన్ ఏజెన్సీ బుల్బుల్ ఫేమ్ త్రిప్తి డిమ్రీ- గిల్టీలో నటించిన గుర్ఫతే పిర్జాదా - గెహ్రైయాన్ లో చివరిగా కనిపించిన ధైర్య కర్వా సహా అనేకమంది యువ‌న‌టీన‌టులు  ఈ ఏజెన్సీలో భాగం.  ఇటీవలే కరణ్ 'జగ్ జగ్ జీయో'తో పెద్ద స్క్రీన్ పై అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్న వరుణ్ సూద్ ను కూడా ఏజెన్సీ స్వాగతించింది. ఈ చిత్రంలో వరుణ్ ధావన్- కియారా అద్వానీ- అనిల్ కపూర్- నీతూ కపూర్- మనీష్ పాల్- ప్రజక్తా కోలి కూడా నటించారు.
Tags:    

Similar News