ప్రభాస్.. ఇంకా ఎన్ని రోజులు ఇలా?

Update: 2022-07-27 00:30 GMT
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం అత్యధిక భారీ బడ్జెట్ సినిమాలను లైన్లో పెడుతున్న హీరోలలో ప్రభాస్ టాప్ లిస్ట్ లో ఉంటాడు అని చెప్పవచ్చు. అంతేకాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అతను సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఇప్పటికే బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురష్ అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తయింది.

ప్రస్తుతం చిత్ర యూనిట్ సభ్యులందరూ కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే షూటింగ్ పనులు బాగానే కొనసాగుతున్నప్పటికీ సినిమా ప్రమోషన్స్ పై మాత్రం చిత్ర యూనిట్ పెద్దగా బాధ్యతగా లేకుండా ప్రవర్తిస్తున్నట్లు అభిమానులు నిరాశ చెందుతున్నారు. సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిన కనీసం ఇప్పటివరకు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేయకపోవడం ఆశ్చర్యమైన అనుకుంటున్నారు.

మరోవైపు KFG 2 విడుదలై వంద రోజులు పూర్తయినా కూడా ప్రశాంత్ నీల్ కూడా అదే తరహాలో అప్డేట్స్ ఇవ్వకుండా ఫ్యాన్స్ కు చిరాకు తెప్పిస్తున్నారు.

ఈ క్రమంలో ఆదిపురుష డైరెక్టర్ పై తీవ్రస్థాయిలో అభిమానులు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. గతంలో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేస్తారని అనుకుంటే అది జరగకపోగా ఫ్యాన్స్ క్రియేట్ చేసిన పోస్టర్లనే ఆ దర్శకుడు థాంక్స్ చెబుతూ పోస్ట్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో డైరెక్టర్ ఓం రౌత్ కాస్త నిద్రలేస్తే మంచిది అంటూ మేలుకో ఓం రౌత్ అని ఒక ట్యాగ్ కూడా వైరల్ అయ్యేలా చేస్తున్నారు. షూటింగ్ ఫినిష్ అయినా కూడా ఇంతవరకు చిత్రం నుంచి ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. ప్రస్తుతం విదేశాల్లో 3D టెక్నాలజీకి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నట్లు సమాచారం. ఈ సినిమాను కేవలం ఇండియాలోనే కాకుండా వివిధ దేశాల్లో కూడా భారీ స్థాయిలోనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.

ఇక మొత్తానికి సినిమా అయితే సంక్రాంతికి విడుదల చేస్తామని మాట ఇచ్చారు. కానీ ఇప్పటివరకు ఒక్క పోస్టర్ అయిన విడుదల చేయకపోవడం ఆశ్చర్యమే. అసలు ఎందుకు లేట్ అవుతుంది అనే విషయంలో కూడా ఇప్పటివరకు ఎవరు పెద్దగా స్పందించడం లేదు. ఇక ప్రస్తుతం అభిమానుల ట్రెండింగ్ ఆవేశాన్ని చూసినా అయినా చిత్ర యూనిట్ స్పందిస్తుందో లేదో చూడాలి.
Tags:    

Similar News