'పుష్ప' సెకండ్ సాంగ్ అప్డేట్ ఇచ్చారు

Update: 2021-09-27 08:32 GMT
అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమా చిత్రీకరణ స్పీడ్ గా జరుగుతోంది. సినిమాను క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారు. పుష్ప ను రెండు పార్ట్ లుగా విడుదల చేయబోతున్నారు. మొదటి పార్ట్‌ చిత్రీకరణ పూర్తి చేసి ఈ ఏడాది చివరి వరకు విడుదల చేస్తే చిన్న గ్యాప్ తీసుకుని పుష్ప 2 షూటింగ్‌ ను మొదలు పెట్టి వచ్చే ఏడాది చివరి వరకు విడుదల చేసేలా ప్లాన్ చేయడం జరిగింది. కరోనా కారణంగా షూటింగ్‌ కాస్త ఆలస్యం అయినా కూడా సినిమాను మాత్రం ఖచ్చితంగా ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని పట్టుదలతో మేకర్స్ ఉన్నారట. అందుకే సినిమా నుండి ఇప్పటికే ఒక పాటను విడుదల చేశారు. దేవిశ్రీ మార్క్ ఉన్న ఆ పాట అందరిని ఆకట్టుకుంది. ఆ పాటకు భారీగా వ్యూస్ లైక్స్ యూట్యూబ్‌ లో దక్కాయి. ఇప్పుడు మరో పాట ను విడుదల చేయబోతున్నట్లుగా యూనిట్‌ సభ్యులు ప్రకటించారు.

చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ ఫొటోను షేర్‌ చేసి ఈ అందమైన లొకేషన్ లో చిత్రీకరించిన సాంగ్‌ ను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. అది ఎప్పుడు అనేది అతి త్వరలోనే ప్రకటించనున్నట్లుగా కూడా పేర్కొన్నారు. దసరా వరకు సెకండ్‌ సాంగ్‌ కోసం వెయిట్‌ చేయాలని కొందరు అంటూ ఉంటే మరి కొందరు మాత్రం ముందుగానే పుష్ప సెకండ్‌ సాంగ్‌ ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మొత్తానికి వచ్చే నెలలో పుష్ప సెకండ్‌ సాంగ్‌ ను విడుదల చేయడం కన్ఫర్మ్‌ అయ్యింది. అల్లు అర్జున్ మరియు రష్మికల మద్య ఉండే రొమాంటిక్ సాంగ్‌ ను ఈ లొకేషన్ లో తీశారనే సమాచారం అందుతోంది. పచ్చటి ప్రకృతి మద్య సుకుమార్‌ తనదైన శైలిలో అద్బుతంగా పాటను చిత్రీకరించి ఉంటాడు. ఇక పాట ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఎందుకంటే దేవి శ్రీ ప్రసాద్‌ స్వరపర్చిన పాట అవ్వడం వల్ల అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

అల్లు అర్జున్ మరియు సుకుమార్‌ ల కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సినిమాలోని పాటలన్నీ కూడా మ్యూజికల్ గా సూపర్‌ హిట్‌ అవుతాయని మొదటి నుండి యూనిట్‌ సభ్యులు అంటున్నారు. మొదటి పాట అయిదు భాషల్లో అయిదుగురు ప్రముఖ సింగర్స్ తో పాడించాడు. రెండవ పాట కూడా అయిదు భాషల్లో రికార్డ్‌ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అయిదు భాషల్లో కూడా ఈసారి ప్రముఖ సింగర్స్ తో పాడిస్తున్నాడట. ఇప్పటికే నాలుగు భాషల్లో పాట రికార్డింగ్‌ ను ముగించారని యూనిట్‌ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది. ఒకటి రెండు రోజుల్లో అన్ని భాషల్లో కూడా పాట రికార్డింగ్‌ పూర్తి చేస్తారు. ఆ తర్వాత చిన్న గ్లిమ్స్ ను విడుదల చేస్తారు.. యూనిట్‌ సభ్యులు చాలా సంతృప్తిగా పాట విషయంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే కాస్త ముందుగానే పాటను విడుదల చేయాలని భావిస్తున్నారట. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్‌ ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే. సునీల్‌ ఇంకా అనసూయలు కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు.






Tags:    

Similar News