చరణ్ వచ్చేశాడోచ్..!

Update: 2023-01-16 10:30 GMT
మెగా పవర్ స్టార్ రాం చరణ్ హైదరాబాద్ వచ్చారు. కొద్దిరోజులుగా ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ కోసం యూఎస్ వెళ్లిన చరణ్ ఈరోజు మార్నింగ్ హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. ఆర్.ఆర్.ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రాగా ఆ ఈవెంట్ కోసం ఆర్.ఆర్.ఆర్ టీం మొత్తం వెళ్లింది. రాజమౌళి ఫ్యామిలీతో పాటుగా ఎన్.టి.ఆర్, రాం చరణ్ లు కూడా సతీ సమేతంగా యూఎస్ వెళ్లారు. ఇక అక్కడ మన వాళ్ల హంగామా తెలిసిందే.

ట్రిపుల్ ఆర్ సినిమాను హాలీవుడ్ మేకర్స్ కూడా ప్రత్యేకంగా ప్రశంసిస్తూ సినిమా గురించి గొప్పగా చెబుతున్నారు. ఇక వాటితో పాటుగా గోల్డెన్ గ్లోబ్, సినీ క్రిటిక్స్ అవార్డులు ప్రత్యేకత తెచ్చాయి. ఈ అవార్డు వేడుకల్లో హాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాతలు పాల్గొన్నారు. వారితో మన తెలుగు హీరోలు మీట్ అవ్వడం ప్రత్యేకమైన సందర్భంగా చెప్పుకోవచ్చు. తెలుగు సినిమాకు హాలీవుడ్ అవార్డ్ అందించేలా చేసిన రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే.

యూఎస్ లో ఆర్.ఆర్.ఆర్ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ ని ప్రత్యక్షంగా చూసి అందులో నటించిన ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఎంజాయ్ చేశారు. ఇక అవార్డుల వేడుక ముగియగా రీసెంట్ గా ఎన్.టి.ఆర్ హైదరాబాద్ చేరుకోగా చరణ్ ఈరోజు ఉదయం భాగ్యనగరానికి వచ్చారు. చరణ్ తో పాటు ఉపాసన కూడా ఉన్నారు. ఇక చరణ్ నెక్స్ట్ సినిమా విషయానికి వస్తే శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది.

సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ ఇయర్ సమ్మర్ కి రిలీజ్ ప్లానింగ్ తో సినిమా షూటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి 70 శాతం వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుంచి త్వరలో ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేస్తారని టాక్.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News