ముంబయిలో నా సగం జీవితం అతడితోనే : రానా

Update: 2020-10-07 13:00 GMT
యంగ్‌ స్టార్‌ హీరో రానా టాలీవుడ్ తో పాటు బాలీవుడ్‌ లో కూడా మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. బాలీవుడ్‌ ప్రముఖులో రానాకు మంచి పరిచయాలున్నాయి. గత మూడు నాలుగు సంవత్సరాలుగా బాలీవుడ్‌ నెం.1 హీరోగా కొనసాగుతూ ఉన్న అక్షయ్‌ కుమార్‌ తో సైతం రానాకు చాలా మంది స్నేహం ఉందట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే నో ఫిల్టర్‌ నేహా షో లో చెప్పుకొచ్చాడు. గతంలో అక్షయ్‌ కుమార్‌ తో కలిసి బేబీ మరియు హౌస్‌ ఫుల్‌ 4 సినిమాల్లో నటించాడు. ఆ రెండు సినిమాల షూటింగ్స్‌ సమయంలో జరిగిన సరదా సంఘటనలు టాక్‌ షో సందర్బంగా గుర్తు చేసుకున్నాడు.

ముంబయిలో తాను ఉన్న జీవిత కాలంలో సగం రోజులు అక్షయ్‌ కుమార్‌ తోనే గడిపినట్లుగా చెప్పుకొచ్చాడు. ఎప్పుడు ముంబయి వెళ్లినా కూడా అక్షయ్‌ ను కలవడం జరుగుతుందని రానా పేర్కొన్నాడు. ముంబయిలో ఉన్న సమయంలో నన్ను ఉదయం 5.45 కే రేడియో షోకు తీసుకు వెళ్లేవాడంటూ రానా పేర్కొన్నాడు. ఈ టాక్‌ షో లో అక్షయ్‌ కుమార్‌ తో తన అనుబంధం.. ప్రస్తుతం బాలీవుడ్ లో చేస్తున్న సినిమాలతో పాటు ఇంకా పలు విషయాలను కూడా మాట్లాడాడు.

పెళ్లి గురించి మాట్లాడుతూ కేవలం 30 మంది బంధు మిత్రులతో తన పెళ్లి జరిగిందన్నాడు. తన ఇంటి నుండి పెళ్లి మండపం కేవలం అయిదు నిమిషాల జర్నీ మాత్రమే అన్నాడు. పెళ్లికి రాలేక పోయిన స్నేహితులకు వర్చువల్‌ రియాల్టీ ద్వారా చూసేలా ఏర్పాట్లు చేశామన్నాడు.

ప్రస్తుతం రానా అరణ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నాడు. ఆ సినిమా కాకుండా 'విరాటపర్వం' సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమాలు కాకుండా ఇంకా కొన్ని సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి. త్వరలో రానా షూటింగ్‌ లో పాల్గొనబోతున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత రానా కొత్త సినిమాలను ప్రకటించే అవకాశం ఉంది.
Tags:    

Similar News