తార‌క్ మీటింగ్ వెన‌క ఆంత‌ర్యమేమిటో!?

Update: 2016-06-16 05:11 GMT
సినిమా విడుద‌ల‌కి ముందుగానీ క‌థానాయ‌కుల‌కు ఫ్యాన్స్ గుర్తుకు రారు.  ఆడియో ఫంక్ష‌న్ త‌ర్వాత నుంచే  ఫ్యాన్స్‌ తో ఇంట‌రాక్ట్ అవుతూ - సినిమా ఎలా ఉందో చెబుతూ అంచ‌నాల్ని  పెంచేస్తుంటారు. మ‌ళ్లీ  సినిమా విడుద‌ల‌య్యాక, అది వాళ్ల‌కి బాగా న‌చ్చిందని తెలిసిన‌ప్పుడు ఇంకో ద‌ఫా  క‌లిసి కృత‌జ్ఞ‌త‌లు చెబుతుంటారు. అంతే...  మ‌ళ్లీ కొత్త సినిమా విష‌యంలోనూ ఇలాగే జ‌రిగిపోతుంటుంది. అయితే ఎన్టీఆర్ మాత్రం అందుకు భిన్నంగా అభిమానుల్ని క‌లుసుకొంటున్నాడు. సినిమా సెట్‌ కే వాళ్ల‌ని పిలిపిస్తున్నాడు. స‌ర‌దాగా ముచ్చ‌ట్లు చెబుతూ - ఫొటోల‌కి పోజులిస్తూ ఆనందానికి గురిచేస్తున్నాడు. అక్క‌డ సినిమా గురించే కాకుండా, మ‌నం భ‌విష్య‌త్తులోనూ ఇలా క‌లుస్తూనే ఉందామ‌ని వాళ్ల‌కి మ‌రింత ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ట ఎన్టీఆర్‌.

జ‌న‌తా గ్యారేజ్ సెట్లో గ‌త వారం రోజులుగా అదే తంతు  జ‌రుగుతోంది. రోజూ నాలుగైదు జిల్లాల నుంచి వ‌చ్చే అభిమానుల్ని షూటింగ్ విరామంలో క‌లుసుకొంటున్నాడట ఎన్టీఆర్‌. వాళ్ల‌తో స‌ర‌దాగా మాట్లాడి పంపిస్తున్నాడ‌ట‌. తార‌క్ అలా ఫ్యాన్స్‌ తో మీటింగ్ అవ్వ‌డం వెన‌క రాజ‌కీయ కోణం కూడా ఉంద‌నేది ఇప్పుడు పలువురి మాట‌. మ‌రి నిజంగానే తార‌క్ రాజ‌కీయ కోణంతోనే వాళ్ల‌ని క‌లుసుకొంటున్నాడా లేక జ‌న‌తా గ్యారేజ్‌ కి హైప్ తీసుకురావ‌డం కోస‌మా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. జ‌న‌తా గ్యారేజ్ చిత్రం ఆగ‌స్టు 12న ప్రేక్ష‌కుల  ముందుకొస్తోంది. ఆ చిత్రం కోసం హైదరాబాద్‌ లో వేసిన భారీ సెట్లోనే ఎన్టీఆర్ ఇప్పుడు అభిమానుల్ని క‌లుసుకొంటున్నాడు.
Tags:    

Similar News