భర్త మరణం నుంచి రికవరీ.. రెండో పెళ్లికి రెఢీ అవుతుందా?

Update: 2022-08-25 04:13 GMT
జీవితంలో ఎదురయ్యే విషాదాలు మజిలీగా ఉండాలే తప్పించి.. వాటి దగ్గరే ఆగిపోవటంలో అర్థం లేదు. ఈ సిద్ధాంతాన్ని ఎంత త్వరగా అర్థం చేసుకుంటే జీవితం అంత హ్యాపీగా ఉంటుంది. సన్నిహితులు.. మనసుకు దగ్గరైన వారు.. తిరిగి రాలేని లోకాలకు వెళ్లిపోయిన వేళ.. పడే వేదన.. ఎదురయ్యే శోకం అంతా ఇంతా కాదు.

అయితే.. కాలానికి ఉండే గొప్ప గుణంతో.. అలాంటి భావాల్ని అధిగమించే అవకాశం ఉంటుంది. కన్నడ స్టార్ నటుడు చిరంజీవి సర్దా ఉదంతం తెలిసిందే. అనారోగ్యం కారణంగా అనూహ్యంగా మరణించిన ఆయన తీరు కుటుంబ సభ్యులతో పాటు అభిమానుల్ని సైతం శోక సంద్రంలోకి నెట్టేసింది.

చిరంజీవి మరణం వేళకు.. ఆయన సతీమణి కమ్ నటి మేఘనా రాజ్ నిండు గర్భవతి. అలాంటి వేళలో ఆమెకు ఎదురైన శోకానికి అయ్యో అనని వాళ్లు లేరు. భర్త మరణించిన కొద్ది నెలలకు కొడుక్కి జన్మనిచ్చిన ఆమె.. చిన్నారిలో భర్తను చూసుకుంటూ కాలం గడుపుతోంది. అయితే.. ఇటీవల కాలంలో ఆమె రెండో పెళ్లి దిశగా థింక్ చేస్తున్నారన్న మాట వినిపిస్తోంది. దీనికి సంబంధించిన రూమర్లు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి.

ఇలాంటివేళ.. ఆమె రియాక్టు అయ్యారు. తన రెండో పెళ్లి మీద వినిపిస్తున్న వాదనలపై ఆయన క్లారిటీ ఇస్తూ.. 'కొందరు నన్ను మళ్లీ పెళ్లి చేసుకోమని సలహా ఇస్తున్నారు. మరికొందరేమో నా కొడుకును బాగా చూసుకుంటూ అతడితోనే ఉండమంటున్నారు.మరి నేను.. ఎవరి మాట వినాలి?' అంటూ తనకున్న సందేహాన్ని తెలియజేసింది. అంతలోనే తన భర్త గతంలో చెప్పిన మాటను గుర్తు చేసుకుంటున్న ఆమె.. తాను ఏమనుకుంటుందన్న విషయాన్ని చెప్పేశారు.

'నా భర్త ఎప్పుడూ ఒక మాట అంటుండేవాడు. ఈ ప్రపంచం ఏమనుకుంటుందనేది ఎప్పుడూ పట్టించుకోకు. నీ మనసుకు ఏదనిపిస్తే అదే చేయమని చెప్పేవాడు. మళ్లీ పెళ్లి గురించి నాకు నేనుగా ఎప్పుడూ ప్రశ్నించుకోలేదు.

రేపేం జరుగుతుందో? కొద్ది రోజుల తర్వాత నా లైఫ్ ఎలా ఉంటుందో ఆలోచించలేదు' అని చెప్పటం ద్వారా.. ఇప్పటికైతే ఎలాంటి ఆలోచనలు లేవని.. ఫ్యూచర్ లో ఎలా ఉంటానన్న విషయంపై తాను ఇప్పుడు ఆలోచించటం లేదన్న విషయాన్ని ఆమె చెప్పేసిందని చెప్పాలి.
Tags:    

Similar News