కట్టుబాట్లు నెమ్మదిగా తొలగిపోతున్నాయి: రెజీనా

Update: 2019-02-03 01:30 GMT
రెజినా కసాండ్రాకు ఈమధ్య తెలుగులో సినిమాలు తగ్గాయి.  రెజినా చివరిగా నటించిన తెలుగు సినిమా 'అ!' 2017 లో విడుదలైంది. అప్పటినుండి తమిళంపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్న ఈ చెన్నై బ్యూటీ తాజాగా 'ఏక్ లడకికో దేఖా తో ఐసా లగా' సినిమాతో  బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అందరినీ తన పాత్రతో సర్ ప్రైజ్ చేసింది. మహిళా దర్శకురాలు షెల్లీ చోప్రా ధార్ రూపొందించిన ఈ చిత్రం థీమ్ లెస్బియన్ లవ్.

ఈ బోల్డ్ సినిమాలో సోనమ్ కపూర్ - రెజీనాలు ప్రేమికులుగా కనిపించారు.  నిన్నే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.  ఈ సందర్భంగా రెజీనా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా కాన్సెప్ట్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.  ఈ చిత్రం సెన్సిటివ్ సబ్జెక్ట్ కదా.. సెక్షన్ 377 అంశంపై రూపొందింది.. ఆడియన్స్ ను ఎలా కన్విన్స్ చేస్తారు అని అడిగితే "కాలం మారింది. మన చుట్టూ జరిగేవి ప్రజలు గమనిస్తున్నారు. క్రమంగా అన్ని విషయాలను వారు అంగీకరిస్తున్నారు.  ప్రేమకు చాలా రూపాలున్నాయి.  ప్రేమ ఇలానే ఉండాలని.. ఎవరూ బంధనాలు విధించలేరు.. అలాంటి కట్టుబాట్లు నెమ్మదిగా తొలగిపోతున్నాయి" అని చెప్పింది. 

అంతే కాదు.. లెస్బియన్ లవ్ గురించి మాట్లాడుతున్నారని.. ప్రజల్లో అవగాహన పెరుగుతోందని. కాలంలో మార్పు వస్తోంది కాబట్టి ఇలాంటివాటిని ఒప్పుకోక తప్పదని తెలిపింది.  ఈ సినిమాలో లెస్బియన్ పాత్ర చేసే సమయంలో తనకేమీ ఇబ్బందిగా అనిపించలేదని క్లారిటీ ఇచ్చింది.  తనకు కొంతమంది హోమోసెక్సువల్ ఫ్రెండ్స్ ఉన్నారని.. వారిపట్ల తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని.. ఆర్ద్రత ఉందని తెలిపింది. మోరల్ పోలిసింగ్ లాంటివి పక్కనపెట్టి వారిమానాన వారిని బ్రతకనివ్వడం మంచిదని చెప్పింది.  
Tags:    

Similar News