టైగర్ బయోపిక్ లో రేణు దేశాయ్?

Update: 2019-02-19 09:42 GMT
మాజీ హీరోయిన్లు.. సినిమాలకు దూరమైన హీరోయిన్లు రీ-ఎంట్రీ ఇవ్వడం కామనే.  పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా అదే రూట్ లో తెలుగు తెరపై మరోసారి మెరవడానికి రెడీ అవుతోందని సమాచారం.  రేణు దేశాయ్ తెలుగులో చేసింది రెండు సినిమాలే.. ఆ రెండు పవన్ కళ్యాణ్ సినిమాలు.  ఆ తర్వాత పవన్ ను పెళ్లి చేసుకోవడంతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు.  2014 లో 'ఇష్క్ వాలా లవ్' అనే మరాఠి సినిమాకు దర్శకత్వం వహించారు.

ఇదిలా ఉంటే తాజాగా 'టైగర్' పేరుతో తెరకెక్కనున్న సినిమాలో ఒక కీలక పాత్రలో నటించేందుకు ఆవిడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ విన్పిస్తోంది. స్టువర్టుపురం దొంగల్లో పేరు మోసినవాడైన టైగర్ నాగేశ్వర రావు జీవితం ఆధారంగా 'టైగర్' అనే సినిమా తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.   'దొంగాట' ఫేమ్ వంశీ కృష్ణ ఈ సినిమాకు దర్శకుడు. మొదట ఈ సినిమాలో రానా దగ్గుబాటి నటిస్తాడని వార్తలు వచ్చాయి గానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేతికి వచ్చిందట. ఈ బయోపిక్ లో బెల్లంకొండ శ్రీనివాస్ టైగర్ నాగేశ్వర రావు పాత్రలోనూ.. రేణు దేశాయ్ టైగర్ పెద్దక్క పాత్రలోనూ నటిస్తారని అంటున్నారు.  

టాలీవుడ్ లో ఇప్పుడు బయోపిక్ ల ట్రెండ్ జోరుగా ఉంది.  మహానాయకులు.. మహానేతలు.. మహానటులు మాత్రమే కాకుండా టైగర్ 'మహా రాబర్' కాబట్టి జనాల్లో కూడా ఆసక్తి ఉండే అవకాశం ఉంది.  అలాంటి మహా బందిపోటు కు అక్కపాత్ర అంటే పవర్ ఫుల్ రోలే.  మరి ఇలాంటి పవర్ఫుల్ పాత్రలో ఎలా రేణు  దేశాయ్ ప్రేక్షకులను ఎలా మెప్పిస్తారో వేచి చూడాలి .
Tags:    

Similar News