అదే రిషి కపూర్ చివరి కోరిక..

Update: 2020-04-30 11:50 GMT
బాలీవుడ్‌ లెజెండరీ యాక్టర్‌ రిషీ కపూర్‌ ఈ రోజు ఉదయం తుది శ్వాస వదిలారు. మరో గొప్ప నటుడు ఇర్పాన్‌ ఖాన్ మరణించిన 24 గంటలు కూడా గడవక ముందే మరో రిషి కపూర్ మరణించడంతో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో రిషీ కపూర్‌ జీవితంలోనూ సంఘటనలు ఆయన పోషించిన పాత్రలు ఆయనతో తమకున్న సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటున్నారు సెల్రబిటీలు. ఆయనకు కడసారిగా చూసి నివాళులు అర్పించే అవకాశం కూడా లేకపోవటంతో సోషల్ మీడియా ద్వారా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ మాత్రమే కాదు రిషి కపూర్ మరణం పట్ల యావత్ భారత చలనచిత్ర రంగ ప్రముఖులు ఎమోషనల్ అయిపోయి తమ నివాళులు అర్పిస్తున్నారు.

ఈ నేపథ్యంలో రిషీ కపూర్‌ చేసిన చివరి ట్వీట్‌ వైరల్‌ గా మారింది. సోషల్‌ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌ గా ఉండే రిషీ కపూర్‌ ఏప్రిల్ 2న తన చివరి ట్వీట్ చేశారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న కరోనా మహమ్మారి పరిస్థితులను ఎదుర్కొంటున్న దేశ ప్రజలకు కొన్ని విలువైన సూచనలు అందించారు. కరోనా పై పోరాటంలో ముందు వరుసలో నిలబడి పోరాడుతున్న పోలీసులు, వైద్యులు, నర్సుల పట్ల గౌరవం చూపించాలని ప్రజలకు అభిమానులకు విజ్ఞప్తి చేశారు. మనకోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడుతున్న వారిపై దాడులుమానుకోవాలని కోరారు. ఈ ట్వీట్ చేసిన తరువాత సోషల్‌ మీడియాకు దూరంగా ఉన్న ఆయన ఆరోగ్యం విషమించటంతో చికిత్స పొందుతూ.. ఈరోజే తుది శ్వాస విడిచారు.
Tags:    

Similar News