మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకులుగా నటిస్తున్న #RRR పాన్ ఇండియా కేటగిరీలో జనవరి 7న రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా `బాహుబలి` రేంజు వసూళ్లే టార్గెట్ గా బాక్సాఫీస్ బరిలోకి దిగుతోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో జనవరి 7న రిలీజ్ చేయాలని కృతనిశ్చంతో టీమ్ ముందుకు వస్తోంది. మరి ఈ తేదీ `ఆర్.ఆర్.ఆర్` రిలీజ్ కి అనుకూలమైనదేనా? అంటే అంతా ప్రతికూల పరిస్థితులే కనిపిస్తున్నాయనేది ఒక విశ్లేషణ. `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ అయిన ఐదు రోజుల వ్యవధిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తోన్న `భీమ్లా నాయక్` భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతోంది.
కేవలం 6 రోజుల గ్యాప్ లో మరో పాన్ ఇండియా చిత్రం `రాధేశ్యామ్` రిలీజ్ అవుతోంది. అంటే `ఆర్ ఆర్ ఆర్` కి కంప్లీట్ గా థియేటర్లు దొరికేది కేవలం ఐదు రోజులు మాత్రమే. ఆ తర్వాత థియేటర్లను ఇతరులతో పంచుకోవాల్సి ఉంటుంది. చిన్న గ్యాప్ లోనే రెండు క్రేజీ చిత్రాలతో పోటీపడాల్సి ఉంటుంది. దీనివల్ల `ఆర్ ఆర్ ఆర్` కి థియేటర్లు మరింత తగ్గుతాయి. ఇక తమిళ్ లో తళా అజిత్ నటిస్తోన్న `వాలిమై` కూడా రిలీజ్ అవుతుంది. కాబట్టి అజిత్ క్రేజ్ నడుమ `ఆర్.ఆర్.ఆర్` తమిళనాడులో నిలదొక్కుకుంటుందా? అన్నది ఓ సందేహం. తెలుగు రాష్ట్రాలు సహా ఓవర్సీస్ అన్ని చోట్లా `ఆర్.ఆర్.ఆర్` ఇదే పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
మరి ఇంత టిఫికల్ కాంపిటీషన్ నడుమ `ఆర్ ఆర్ ఆర్`- `బాహుబలి` రికార్డులను బ్రేక్ చేయగలదా? అంటే కష్టమేనని ట్రేడ్ వర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే ఏపీ సర్కార్ అన్ని సినిమాలకు ఒకే టిక్కెట్ రేటును నిర్ణయించింది. ఇలా ఇన్ని ప్రతికూల పరిస్థితుల నడుమ `ఆర్ ఆర్ ఆర్` కి ఎటు చూసినా జనవరి 7 అనేది అగ్ని పరీక్షలాగే కనిపిస్తోంది. ఎంత వసూల్ చేయాలన్నా కేవలం 5 రోజుల్లోనే సాధించాలి. కానీ `బాహుబలి` రిలీజ్ సమయంలో ఎలాంటి పోటీ లేదు. థియేటర్ల సమస్యా లేదు. అందుకే ఆ సినిమా భారీ వసూళ్లు సాధించిందన్నది నిపుణుల మాట. మరి ఈ సందేహాలన్నింటిని `ఆర్.ఆర్.ఆర్` బ్రేక్ చేసిందంటే? ఇండియాస్ నెంబర్ -1 డైరెక్టర్ గా జక్కన్నని కీర్తించాల్సిందే.
కేవలం 6 రోజుల గ్యాప్ లో మరో పాన్ ఇండియా చిత్రం `రాధేశ్యామ్` రిలీజ్ అవుతోంది. అంటే `ఆర్ ఆర్ ఆర్` కి కంప్లీట్ గా థియేటర్లు దొరికేది కేవలం ఐదు రోజులు మాత్రమే. ఆ తర్వాత థియేటర్లను ఇతరులతో పంచుకోవాల్సి ఉంటుంది. చిన్న గ్యాప్ లోనే రెండు క్రేజీ చిత్రాలతో పోటీపడాల్సి ఉంటుంది. దీనివల్ల `ఆర్ ఆర్ ఆర్` కి థియేటర్లు మరింత తగ్గుతాయి. ఇక తమిళ్ లో తళా అజిత్ నటిస్తోన్న `వాలిమై` కూడా రిలీజ్ అవుతుంది. కాబట్టి అజిత్ క్రేజ్ నడుమ `ఆర్.ఆర్.ఆర్` తమిళనాడులో నిలదొక్కుకుంటుందా? అన్నది ఓ సందేహం. తెలుగు రాష్ట్రాలు సహా ఓవర్సీస్ అన్ని చోట్లా `ఆర్.ఆర్.ఆర్` ఇదే పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
మరి ఇంత టిఫికల్ కాంపిటీషన్ నడుమ `ఆర్ ఆర్ ఆర్`- `బాహుబలి` రికార్డులను బ్రేక్ చేయగలదా? అంటే కష్టమేనని ట్రేడ్ వర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే ఏపీ సర్కార్ అన్ని సినిమాలకు ఒకే టిక్కెట్ రేటును నిర్ణయించింది. ఇలా ఇన్ని ప్రతికూల పరిస్థితుల నడుమ `ఆర్ ఆర్ ఆర్` కి ఎటు చూసినా జనవరి 7 అనేది అగ్ని పరీక్షలాగే కనిపిస్తోంది. ఎంత వసూల్ చేయాలన్నా కేవలం 5 రోజుల్లోనే సాధించాలి. కానీ `బాహుబలి` రిలీజ్ సమయంలో ఎలాంటి పోటీ లేదు. థియేటర్ల సమస్యా లేదు. అందుకే ఆ సినిమా భారీ వసూళ్లు సాధించిందన్నది నిపుణుల మాట. మరి ఈ సందేహాలన్నింటిని `ఆర్.ఆర్.ఆర్` బ్రేక్ చేసిందంటే? ఇండియాస్ నెంబర్ -1 డైరెక్టర్ గా జక్కన్నని కీర్తించాల్సిందే.