రామ్ చరణ్-ఎన్టీఆర్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం `ఆర్.ఆర్.ఆర్` జనవరి 7న రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ సినిమా అన్ని పనులు పూర్తిచేసుకుని ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యమవ్వడం.. అటుపై పోస్ట్ ప్రొడక్షన్ పనులు జాప్యం అవ్వడం వంటి కారణాలతో ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. అయితే నిన్నటితో `ఆర్.ఆర్.ఆర్` షూటింగ్ ప్రారంభించి నాలుగేళ్లు పూర్తయిన సందర్భగా యూనిట్ తారక్-చరణ్..రాజమౌళి కలిసి ఉన్న ఓ రేర్ ఫోటోని పోస్ట్ చేస్తూ పాత జ్ఞాపకాల్లో కి వెళ్లింది.
దీంతో ఓ నెటిజనుడు `ఆర్.ఆర్.ఆర్` రిలీజ్ పై వ్యంగ్యంగా స్పందిచాడు. నేను డిప్లోమాలో ఉన్నప్పుడు సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇప్పుడు బిటెక్ కూడా పూర్తయింది. అయినా ఇప్పటివరకూ సినిమా రిలీజ్ కాలేదేమిటో! అంటూ సెటైర్ వేసాడు. ఈ ట్వీట్ ని రీ ట్వీట్ చేస్తూ చిత్ర యూనిట్ ఏం చేద్దాం మరి.. నువ్వు కాలేజీకి వెళ్లనన్ని రోజులు మేము కూడా షూటింగ్ చేయలేదని కౌంటర్ వేసింది. మరి ఇలా కౌంటర్ ఎన్ కౌంటర్ కి అసలు కారణం ఎవరంటే? కరోనా మహమ్మారి పుణ్యమేనన్నది తెలిసిందే. కొవిడ్ కారణంగా ఎక్కడిక్కడ జనజీవనమే స్థంబించిపోయింది. ఏడాదిన్నరగా కరోనాతో ప్రజలు పోరాడుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికి కాస్త ఉపశమనం కలిగింది కానీ ఇంకేమయ్యేదో.
క్రైసిస్ కారణంగా ఇండస్ట్రీ ఇబ్బందుల్లో పడింది. ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితుల నుంచి కోలుకుంటోంది. సినిమాలు సక్రమంగా రిలీజ్ అవుతున్నాయి. ప్రేక్షకులు థియేటర్లకు తరలి వస్తున్నారు. డిసెంబర్ లో అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. కరోనా మొదలైన నాటి నుంచి ఇప్పటివరకూ మీడియం రేంజ్ హీరోల సినిమాలే రిలీజ్ అయ్యాయి. దీంతో ప్రేక్షకులు పెద్దగా ఆసక్తిని చూపించలేదు. డిసెంబర్ నుంచి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి అవన్నీ లైన్ లోకి వచ్చే అవకాశం ఉంది.
దీంతో ఓ నెటిజనుడు `ఆర్.ఆర్.ఆర్` రిలీజ్ పై వ్యంగ్యంగా స్పందిచాడు. నేను డిప్లోమాలో ఉన్నప్పుడు సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇప్పుడు బిటెక్ కూడా పూర్తయింది. అయినా ఇప్పటివరకూ సినిమా రిలీజ్ కాలేదేమిటో! అంటూ సెటైర్ వేసాడు. ఈ ట్వీట్ ని రీ ట్వీట్ చేస్తూ చిత్ర యూనిట్ ఏం చేద్దాం మరి.. నువ్వు కాలేజీకి వెళ్లనన్ని రోజులు మేము కూడా షూటింగ్ చేయలేదని కౌంటర్ వేసింది. మరి ఇలా కౌంటర్ ఎన్ కౌంటర్ కి అసలు కారణం ఎవరంటే? కరోనా మహమ్మారి పుణ్యమేనన్నది తెలిసిందే. కొవిడ్ కారణంగా ఎక్కడిక్కడ జనజీవనమే స్థంబించిపోయింది. ఏడాదిన్నరగా కరోనాతో ప్రజలు పోరాడుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికి కాస్త ఉపశమనం కలిగింది కానీ ఇంకేమయ్యేదో.
క్రైసిస్ కారణంగా ఇండస్ట్రీ ఇబ్బందుల్లో పడింది. ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితుల నుంచి కోలుకుంటోంది. సినిమాలు సక్రమంగా రిలీజ్ అవుతున్నాయి. ప్రేక్షకులు థియేటర్లకు తరలి వస్తున్నారు. డిసెంబర్ లో అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. కరోనా మొదలైన నాటి నుంచి ఇప్పటివరకూ మీడియం రేంజ్ హీరోల సినిమాలే రిలీజ్ అయ్యాయి. దీంతో ప్రేక్షకులు పెద్దగా ఆసక్తిని చూపించలేదు. డిసెంబర్ నుంచి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి అవన్నీ లైన్ లోకి వచ్చే అవకాశం ఉంది.