మహాప్రస్థానం టీజర్‌ : రెండు గంటల కథ రెండు గంటల సినిమా

Update: 2020-09-07 13:30 GMT
తనీష్‌ హీరోగా ముస్కాన్‌ సేథీ హీరోయిన్‌ గా జానీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'మహా ప్రస్థానం'. ఈ సినిమా టీజర్‌ ను మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ విడుదల చేశాడు. సినిమా టీజర్‌ విడుదల సందర్బంగా ఈ సినిమాను ఇండియాస్‌ ఫస్ట్‌ సింగిల్‌ షాట్‌ ప్యాట్రన్‌ మూవీ. అంటే సినిమా కథ రెండు గంటల పాటు సాగుతుంది. సినిమా నిడివి కూడా రెండు గంటలు మాత్రమే ఉంటుంది. సాదారణంగా మనం ఒక రాత్రి అంతా సాగిన కథలతో వచ్చిన సినిమాలను చూశాం. ఆ రాత్రంతా జరిగిన కథను రెండు లేదా రెండున్నర గంటల్లో చూపిస్తారు. కాని ఈ సినిమాలో మాత్రం కథ రెండు గంటల్లో మాత్రమే సాగుతుంది. అదే రెండు గంటల సినిమా ఉంటుంది.

ఇండియాలో ఇలాంటి తరహా సినిమాలు రాలేదు అంటూ తనీష్‌ మరియు చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. సినిమా టీజర్‌ కాస్త ఎక్కువ హింతో పాటు కాస్త బోల్డ్‌ సీన్స్ కూడా ఉన్నట్లుగా అనిపిస్తుంది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ గా ఈ సినిమా ఉంటుందని టీజర్‌ ను చూస్తుంటే అనిపిస్తుంది. ఈ సినిమా దర్శకుడు హీరో హీరోయిన్‌ లేదా ఏదైనా కథ కోణంలో సాగదు. కేవలం కెమెరా పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో మాత్రమే ఉంటుంది. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి దక్కతుంది అంటూ దర్శకుడు జానీ పేర్కొన్నాడు. సినిమా షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయ్యింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ చేస్తున్నాం. త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం. అప్పటి వరకు థియేటర్లు ఓపెన్‌ అయితే థియేటర్లలో లేదు థియేటర్లు లేట్‌ అవుతాయి అంటే ఓటీటీలో సినిమాను విడుదల చేస్తామన్నారు.
Full View
Tags:    

Similar News