మెగా హీరో తప్పుకున్నాడే!

Update: 2018-05-04 06:31 GMT
సినిమా ఇండస్ట్రీలో కథలు ట్రావెల్ చేసినట్టుగా ఎవరు ట్రావెల్ చేయలేరు. చాలా వరకు కొన్ని కథలు సింగిల్ సిట్టింగ్ లో ఒకే అవ్వవు. చిన్న దర్శకుల కథలు అయితే సెట్స్ పైకి వచ్చే వరకు నమ్మకం ఉండదు. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే... సాయి ధరమ్ తేజ్ మొదటి సారి ఒక ప్రాజెక్టు  ఒప్పుకున్నాతరువాత తప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇంతవరకు రిజల్ట్ తో సంబంధం లేకుండా సినిమాలను ఒకే చేసిన మెగా మేనల్లుడు ఈ సారి ఒక కథకు మధ్యలో నో చెప్పేశాడు.

విబిన్ని కథలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న చంద్రశేఖర్ యేలేటి గతంలో సాయి ధరమ్ తేజ్ తో ఒక ప్రాజెక్టును ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా సాయి ఎందుకో గాని కుదరడం లేదు అని చెప్పడంతో దర్శకుడు ఏ మాత్రం నిరాశ చెందకుండా తన ఫెవరేట్ హీరోతో వర్క్ చేయడానికి సిద్ధమయ్యాడు. ఒక్కడున్నాడు - సాహసం వంటి సినిమాలతో గోపీచంద్ కి మంచి క్రేజ్ తీసుసుకువచ్చిన చంద్రశేఖర్ మూడవసారి అతనితోనే వర్క్ చేయడానికి సిద్ధమయ్యాడు.

ప్రస్తుతం గోపీచంద్ అపజయాలతో సతమతమవుతున్నాడు. పంతం అనే సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. సమ్మర్ లో వచ్చే ఆ సినిమాపై పెద్దగా అంచనాలు మాత్రం లేవు. దీంతో గోపి ఎలాగైనా ఒక మంచి బాక్స్ ఆఫీస్ కథ దొరికితే బావుండని అనుకుంటున్న సమయంలో రీసెంట్ గా చంద్రశేఖర్ కథ చెప్పడంతో వెంటనే ఒప్పేసుకున్నాడట. సాహసం తరువాత చేస్తున్న చిత్రం కావడంతో తప్పకుండా ఈ కాంబో పై క్రేజ్ ఉంటుంది. మరి గోపికి ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.
Tags:    

Similar News