కళ్యాణ్ సినిమాకి చిరు సొమ్ములు?

Update: 2017-12-16 04:47 GMT
మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కానుగంటి కళ్యాణ్.. టాలీవుడ్ తెరంగేట్రం చేయడం ఖాయమైపోయిందనే వార్తలు గత కొన్ని రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. రాకేష్ శశి దర్శకత్వంలో.. సాయి కొర్రపాటి నిర్మాతగా వారాహి చలనచిత్రం బ్యానర్ పై ఈ సినిమా రూపొందబోతోంది.

అయితే.. మెగాస్టార్ అల్లుడు సినిమాకి సాయి కొర్రపాటి నిర్మాణంలో రూపొందడం చాలామందిని ఆశ్చర్యం కలిగించింది. నిజానికి నందమూరి కుటుంబానికి ఈ నిర్మాత సన్నిహితుడు అంటారు ఇండస్ట్రీ జనాలు. మెగాస్టార్ వారసుడిగా అరంగేట్రం చేసే పర్సన్ మూవీకి ఈయనెందుకు డబ్బులు పెడుతున్నాడా అనుకుంటున్నారు. దీని వెనక చాలా తతంగం నడిచిందని టాక్. తన అల్లుడిని చిన్న సినిమాతో కాకుండా.. గ్రాండ్ లెవెల్ లో లాంఛ్ చేయాలని తలచారట చిరు. ఈ విషయం తెలిసిన రాజమౌళి.. సాయి కొర్రపాటిని చిరు దగ్గరకు తీసుకెళ్లారట.

ఆ తర్వాత దర్శకుడిని ఫైనల్ చేయడం వంటివి వరుసగా జరిగిపోయాయి. కానీ ఈ చిత్ర నిర్మాణంలో సాయి కొర్రపాటి కేవలం 25శాతమే భరిస్తాడని.. మిగిలిన మొత్తం అంతా చిరంజీవే స్వయంగా వెచ్చించనున్నారని తెలుస్తోంది. కళ్యాణ్ అరంగేట్ర చిత్రమే అల్ట్రా హైఎండ్ లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని.. త్వరలోనే ఇందుకు సంబంధించిన అనౌన్స్ మెంట్ రానుందని తెలుస్తోంది.
Tags:    

Similar News