గుర్రం తినే ఆకులు తిన్న స్టార్ హీరో

Update: 2020-04-12 02:30 GMT
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన కుటుంబ సభ్యులతో కలసి తన పాన్వెల్ ఫామ్ హౌస్ లో లాక్ డౌన్ సమయాన్ని గడుపుతున్నాడు. ఈ క్రమంలో సల్మాన్ తన ఫామ్ హౌస్ లో గుర్రంపై రైడ్‌ చేస్తున్న ఫోటోలను - వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఎల్లప్పుడూ తన అభిమానులకు అందుబాటులో ఉండే సళ్ళు భాయ్ ‘మరో రోజు.. ఇలా రైడ్‌’తో లా అనే క్యాప్షన్‌ తో షేర్ చేసాడు. అంతే కాకుండా గుర్రానికి గడ్డి తినిపిస్తున్న మరో వీడియోను కూడా ‘బ్రేక్‌ ఫాస్ట్‌ విత్‌ మై లవ్‌’ టాగ్ లైన్ తో షేర్ చేసాడు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

త‌న రోజువారి ప‌నుల‌కి సంబంధించిన విష‌యాల‌ని ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వ‌స్తున్న భాయిజాన్. నిన్న తన గుర్రానికి అల్పాహారం స‌మ‌యంలో ముందు తాను ప‌చ్చి ఆకుకూర‌లు తిని త‌ర్వాత గుర్రానికి పెట్టాడు. ఈ వీడియోని స‌ల్మాన్ త‌న ఇన్‌ స్టాగ్రామ్‌లో షేర్ చేయ‌డంతో ఫ్యాన్స్ కామెంట్ల వ‌ర్షం కురిపించారు. సల్లు భాయ్ ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో 'రాధే' అనే సినిమాలో నటిస్తున్నారు. రీసెంట్ గా వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన 'దబాంగ్ 3' బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో 'రాధే' పై ఆశలు పెట్టుకున్నాడట సల్మాన్. కరోనా లాక్ డౌన్ ముగిస్తే షూటింగ్ ముందుకు సాగిద్దామని చూస్తున్నారట. గత కొంతకాలంగా కండల వీరుడికి హిట్లు లేని సంగతి తెలిసిందే. అంతవరకు ఫ్యాన్స్ ని తన పోస్టులతో అలరిస్తా అంటున్నాడు సల్మాన్ భాయ్.

వీడియో కోసం క్లిక్ చేయండి
Tags:    

Similar News