విజయ్‌ దేవరకొండను మరికొన్ని రోజుల సమయం అడిగిన సమంత!?

Update: 2022-12-14 05:31 GMT
రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాన దర్శకత్వంలో రూపొందుతున్న ఖుషి సినిమా ఇప్పటి వరకు షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకోవాల్సి ఉంది. కానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సమంత అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటోంది. మయో సైటిస్ అనే దీర్ఘకాలిక వ్యాధితో సమంత బాధ పడుతున్న విషయం తెల్సిందే.

సమంత కొరియా కు ట్రీట్మెంట్ కోసం వెళ్లిందనే వార్తలు వచ్చాయి. అక్కడ నుండి వచ్చిన తర్వాత షూటింగ్స్ లో జాయిన్‌ అవ్వబోతుందని అంతా భావిస్తున్నారు. కానీ విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సమంత ప్రస్తుతం హైదరాబాద్‌ లోనే ఉందట. వైధ్యుల పర్యవేక్షణలో ట్రీట్మెంట్‌ తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటుందట.

గత నెలలో డిసెంబర్‌ రెండవ లేదా మూడవ వారం లో ఖుషి సినిమా షూటింగ్ కు హాజరు అవుతాను అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులకు సమంత చెప్పిందట. కానీ ఇప్పటికి కూడా ఆమె ఆరోగ్యం కుదుట పడకపోవడంతో మరి కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకోవాలని సమంతకు వైద్యులు సూచించారట.

వైద్యుల సలహా మేరకు మరో నెల రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలనే ఉద్దేశ్యంతో ఖుషి చిత్ర నిర్మాతలకు ఇతర యూనిట్‌ సభ్యులకు సమాచారం ఇచ్చిందట.

ముందుగా చెప్పినట్లు తాను ఈ నెలలో షూటింగ్ కు హాజరు కాలేక పోతున్నాను. వచ్చే నెలలో షూటింగ్‌ కు హాజరు అవుతాను అన్నట్లుగా విజయ్ దేవరకొండ ఖుషి చిత్ర యూనిట్‌ సభ్యులకు తెలియజేసిందట.

ఖుషి చిత్ర యూనిట్‌ సభ్యుల వద్ద సమయం అడిగిన సమంత ఇతర సినిమాల్లో కూడా నటించడం లేదట. ఏ ఒక్క సినిమా వర్క్ లో కూడా ఆమె భాగం అవ్వడం లేదు. ఆ మధ్య యశోద సినిమా ప్రమోషన్ కోసం రెండు రోజుల సమయం కేటాయించిన సమంత ఆ తర్వాత మళ్లీ మీడియా ముందుకు రాలేదు.. కెమెరా ముందుకు కూడా వెళ్లలేదు. 



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News