సంపూ మ‌గ‌ధీరుడైన వేళ‌..

Update: 2015-11-13 13:07 GMT
తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో గుర్రం మీద స్వారీ చేయాలంటే మెగాస్టార్ చిరంజీవి త‌ర్వాతే ఎవ‌రైనా. ఐతే రామ్ చ‌ర‌ణ్ సైతం గుర్ర‌పు స్వారీలో తండ్రికి త‌గ్గ త‌న‌యుడిన‌ని రుజువు చేసుకున్నాడు.మ‌గ‌ధీర‌లో చ‌ర‌ణ్ గుర్ర‌పు స్వారీ సినిమాకే హైలైట్ గా నిలిచింది.తాజాగా బ్రూస్ లీ సినిమాలోనూ చిరు - చ‌ర‌ణ్ గుర్ర‌పు స్వారీలో అద‌ర‌గొట్టారు. ఐతే మెగా తండ్రీ కొడుకుల త‌ర్వాత మ‌ళ్లీ గుర్ర‌పు స్వారీతో మోత మోగించ‌డానికి మ‌రో టాలీవుడ్ హీరో త‌యార‌వుతున్నాడు. అత‌నెవ‌రో కాదు.. బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. ఏ సినిమా కోసం అని చెప్ప‌లేదు కానీ.. ఓ చారిత్ర‌క చిత్రం కోసం తాను గుర్ర‌పు స్వారీ చేస్తున్న‌ట్లు ట్విట్ట‌ర్ లో ఓ పిక్ షేర్ చేశాడు సంపూ.

సంపూ చెప్ప‌కున్నా ఆ చారిత్ర‌క చిత్రం కొబ్బ‌రి మ‌ట్ట అని బ‌ర్నింగ్ స్టార్ ఫ్యాన్స్ కి బాగానే తెలుసు.హృద‌య కాలేయం - సింగం 123 త‌ర్వాత సంపూ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న సినిమా ఇది. ఇందులో సంపూ పాపారాయుడు - పెద‌రాయుడు - ఆండ్రాయిడు అనే మూడు విభిన్న పాత్ర‌లు పోషిస్తుండ‌టం విశేషం. ఈ సినిమా లాంచింగ్ పోస్ట‌ర్లు - ప్ర‌మోష‌న‌ల్ సాంగ్‌.. అన్నీ ఇప్ప‌టికే సంచ‌ల‌నం రేపాయి. సంపూతో హృద‌య కాలేయం తీసిన స్టీఫెన్ శంక‌ర్ ఈ సినిమాకు క‌థ‌ - స్క్రీన్ ప్లే - మాట‌లు అందిస్తుండగా.. రొనాల్డ్ రూప‌క్ స‌న్ అనే కొత్త ద‌ర్శ‌కుడు డైరెక్ష‌న్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావ‌చ్చింది. డిసెంబ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు తేవాల‌ని చూస్తున్నారు.
Tags:    

Similar News