చరణ్ సినిమాపై శంకర్ క్లారిటీ.. ఆందోళనలో మెగా ఫ్యాన్స్..!

Update: 2022-08-25 04:01 GMT
విశ్వనటుడు కమల్ హాసన్ మరియు స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రానున్న భారీ ప్రాజెక్ట్ "ఇండియన్ 2". ఇది వీరి కలయికలో 1996 లో వచ్చిన బ్లాక్ బస్టర్ 'భారతీయుడు' చిత్రానికి సీక్వెల్. సగానికి పైగా షూటింగ్ జరిగిన తర్వాత వివిధ కారణాలతో రెండేళ్ల క్రితమే ఈ సినిమా ఆగిపోయింది. అయితే సడన్ గా ఇప్పుడు ఈ చిత్రాన్ని తిరిగి ప్రారంభించారు. దీంతో RC15 సంగతేమిటి అనే ప్రశ్నలు తలెత్తాయి.

'ఇండియన్ 2' సినిమా నిలిచిపోవడంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు బ్యానర్ లో ఓ పాన్ ఇండియా మూవీకి శ్రీకారం చుట్టారు. వెంటనే సెట్స్ మీదకు తీసుకొచ్చి శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు. ఇక శంకర్ హిందీలో 'అపరిచితుడు' చిత్రాన్ని రీమేక్ చేయనున్నట్లు ప్రకటించడం.. లైకా టీమ్ దర్శకుడిపై కోర్టుకు వెళ్లడంతో 'ఇండియన్ 2' చుట్టూ వివాదం నెలకొంది.

అయితే త్వరలోనే 'ఇండియన్ 2' సినిమాని తిరిగి సెట్స్ మీదకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు 'విక్రమ్' విడుదల సమయంలో కమల్ హాసన్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం రామ్ చరణ్ తో చేస్తున్న సినిమా పూర్తైన వెంటనే ఉంటుందని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి దర్శకుడు 'ఇండియన్ 2' సినిమాను రీస్టార్ట్ చేసాడు.

కమల్-శంకర్ సినిమా నిర్మాణంలో లైకా ప్రొడక్షన్స్ తో పాటుగా రెడ్ జయింట్ సంస్థ కూడా భాగమైంది. చెన్నై లో స్టూడియోలో వేసిన భారీ సెట్ లో బుధవారం షూటింగ్ మొదలుపెట్టారు. 'ఇండియన్ 2' సెట్స్ మీదకు వెళ్లడంతో RC15 ప్రాజెక్ట్ పై రూమర్స్ మొదలయ్యాయి. చరణ్ సినిమాని రెండు, మూడు నెలలు పక్కన పెట్టనున్నాడని.. ఈ గ్యాప్ లో RC16 చిత్రాన్ని పట్టాలెక్కించే అవకాశం ఉందని వార్తలు వినిపించాయి.

Rc15 సినిమా చుట్టూ వస్తున్న రూమర్స్ మెగా అభిమానులను కలవరపెట్టాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు శంకర్ సోషల్ మీడియా వేదికగా ఓ క్లారిటీ ఇచ్చారు. 'ఇండియన్ 2' మరియు 'RC15' సినిమాలను ఒకేసారి సమాంతరంగా చిత్రీకరించబోతున్నట్లు తెలిపారు. చరణ్ మూవీ కొత్త షెడ్యూల్ సెప్టెంబర్ మొదటి వారంలో స్టార్ట్ చేస్తామని.. హైదరాబాద్ - వైజాగ్ లలో షూటింగ్ జరుగుతుందని పేర్కొన్నారు.

శంకర్ ట్వీట్ తో అందరికీ ఓ స్పష్టత వచ్చేసింది. కాకపోతే అగ్ర దర్శకుడు ఒకేసారి శంకర్ రెండు భారీ ప్రాజెక్ట్స్ ను టేకప్ చేయడం చర్చనీయాంశంగా మారింది. రెండు ప్రతిష్టాత్మక భారీ చిత్రాలను ప్యారలల్ గా షూట్ చేయాలంటే డైరెక్టర్ మీద చాలా ఒత్తిడి ఉంటుంది. ఏమాత్రం ఫోకస్ షిప్ట్ అయినా ఔట్ ఫుట్ మీద ప్రభావం పడుతుంది.

అందులోనూ RRR తర్వాత 'ఆచార్య' సినిమాతో రామ్ చరణ్ ప్లాప్ రుచి చూసారు. తదుపరి చిత్రంతో సాలిడ్ సక్సెస్ అందుకోవాలని మెగా ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు. శంకర్ సినిమా కచ్చితంగా చెర్రీ పాన్ ఇండియా ఇమేజ్ ను కాపాడుతుందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాలు షూట్ చేస్తే పరిస్థితి ఏంటనే విషయం మీద అభిమానుల్లో ఆందోళన మొదలైంది.

కానీ శంకర్ మాత్రం 'ఇండియన్ 2' మరియు 'RC15' సినిమాలను పక్కా ప్లానింగ్ తో పూర్తి చేయాలని ఫుల్ క్లారిటీతోనే ఉన్నట్లు ఇన్సైడ్ వర్గాలు అంటున్నాయి. గత కొంతకాలంగా తన స్థాయికి తగ్గ హిట్లు అందుకోలేకపోతున్న దర్శకుడు.. ఈసారి బ్యాక్ టూ బ్యాక్ రెండు బిగ్ ప్రాజెక్ట్స్ తో బౌన్స్ బ్యాక్ అవ్వాలని భావిస్తున్నారు. మరి ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో వేచి చూడాలి.
Tags:    

Similar News