అందరూ చూస్తుండగా అనసూయ ను అక్కడ టచ్ చేశాడు.. నోరెళ్ల బెట్టిన సినీజనాలు!

Update: 2021-03-10 06:30 GMT
బుల్లితెరపై తానేంటో నిరూపించుకున్న‌ యాంక‌ర్ అన‌సూయ‌.. ఇప్పుడు వెండి తెర‌పైనా స‌త్తా చాటుతున్నారు. ప్ర‌స్తుతం వ‌రుస ఆఫ‌ర్ల‌తో ఇండ‌స్ట్రీలో దూసుకుపోతున్నారు. టాలీవుడ్ లోనే కాకుండా బ‌య‌ట‌ కూడా హ‌వా కొన‌సాగిస్తున్నారు. సినిమాల్లో సైడ్ క్యారెక్ట‌ర్లు వేస్తూ కెరీర్ మొద‌లు పెట్టిన అన‌సూయ‌.. ఆ త‌ర్వాత జ‌బ‌ర్త‌స్ షో ద్వారా ఫుల్ ఫేమ‌స్ అయ్యారు. ఇప్పుడు.. వెండి తెర‌పై ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించే స్థాయికి చేరారు. అయితే.. లేటెస్ట్ గా ఓ రైట‌ర్ ఆమెను ట‌చ్ చేసి అంద‌రికీ షాక్ ఇచ్చాడు.

ఇండ‌స్ట్రీలో ఇప్పుడు అన‌సూయ మోస్ట్ వాంటెడ్ గా మారిపోయింది. ఆమె న‌టిస్తే.. త‌మ సినిమాల‌కు క్రేజ్ వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. క్షణం, కథనం, రంగ‌స్థ‌లం వంటి చిత్రాల ద్వారా టాలెంట్‌ నిరూపించుకున్న అన‌సూయ.. మేక‌ర్స్ కు మంచి ఆప్ష‌న్ గా మారారు. అందుకే అవ‌కాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ఈ అమ్మ‌డి చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి.

కృష్ణ‌వంశీ రూపొందిస్తున్న ‘‘రంగ‌మార్తాండ’‌’, సునీల్ హీరోగా వ‌స్తున్న ‘‘వేదాంతం రాఘ‌వ‌య్య‌’’, రవితేజ హీరోగా రూపొందుతున్న ‘‘ఖిలాడీ’’ సినిమాతోపాటు ఇంకా పలు ఆఫర్లు ఉన్నాయి. ఇప్ప‌టికే కోలీవుడ్ లో సినిమాకు సైన్ చేసింది. అదేవిధంగా మ‌ల‌యాళంలోనూ ప్ర‌వేశిస్తోంది. మ‌మ్ముట్టి హీరోగా న‌టిస్తున్న సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అంతేకాదు.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌- క్రిష్ సినిమాలోనూ కీల‌క పాత్ర చేస్తోంద‌ని స‌మాచారం.

కాగా.. ఐట‌మ్ సాంగ్స్ లోనూ చిందేస్తోందీ బ్యూటీ. ‘‘చావు కబురు చల్లగా’’ అనే చిత్రంలో ‘‘పైన పటారం లోన లొటారం’’ అనే పాటలో కాలు కదిపింది. ఈ పాటకు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా మార్చి 19న రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ‘‘పైన పటారం లోన లొటారం’’ అనే పాట రాసిన సత్యనారాయణ రెడ్డి అనే యువకుడు అనసూయను టచ్ చేసి షాకిచ్చాడు.

అతని వయసు కేవలం పదహారు సంవత్సరాలు. స్టేజ్ పై మాట్లాడేందుకు సిద్ధమైన సత్యానారాయణ.. ముందుగా వెళ్లి అనసూయ కాళ్లు పట్టుకున్నాడు. దీంతో అక్కడున్నవారంతా షాకయ్యారు. ఆ తర్వాత తానలా ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పాడు. అనసూయ తనకన్నా పెద్దవారని, అయితే.. తాను దండం పెట్టింది ఆమె వయసు కాదని, ఆమె అనుభవానికి అని చెప్పుకొచ్చాడు.
Tags:    

Similar News