నార్త్ లో వెలుగుతున్న సౌత్ హీరోయిన్లు

Update: 2022-10-14 23:30 GMT
ఉత్త‌రాదిన అవ‌కాశాలొస్తున్నా ద‌క్షిణాదిన ఎప్ప‌టికీ క్రేజ్ త‌గ్గ‌ని క‌థానాయిక‌ల జాబితాను తిర‌గేస్తే ఇందులో ఓ ఐదు పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. సమంతా రూత్ ప్రభు -రష్మిక మందన్న మొద‌లు పూజా హెగ్డే- కియ‌రా అద్వాణీ- న‌య‌న‌తార మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ జాబితాలో ఉన్నారు. ప్రస్తుతం ప్రతి పెద్ద తెలుగు చిత్రానికి మొదటి ఎంపిక గా క‌నిపిస్తున్న‌ దక్షిణ భారత నటీమణులుగా ఆ ఐదుగురి పేర్లు వినిపిస్తున్నాయి.

సమంత రూత్ ప్రభు సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ లో కూడా హాట్ ఫేవరెట్. ఊ అంటావా పాట‌తో నార్త్ ని ఒక ఊపు ఊపింది. సామ్ ని తమ సినిమాల్లో నటింపజేయాలని కోరుకునే దర్శకనిర్మాతలు ఎందరో ఉన్నారు. ప్రస్తుతం తనకు ఇంత‌టి కీర్తిని తెచ్చిపెట్టినందున తెలుగు పరిశ్రమకు అన్నివిధాలా ప్రాధాన్యతనిస్తోంది. సౌత్ ఇండస్ట్రీలోని పెద్ద ఫిల్మ్ మేకర్స్ స‌మంత‌తో కలిసి పని చేయాల‌నుకుంటున్నారు. ఉత్త‌రాదినా క్రేజీగా అవ‌కాశాలొస్తున్నాయి.

సమంతా తర్వాత రష్మిక మందన్న జాబితాలో టాప్ 2లో ఉంది. చాలా చిన్న వయస్సులో త‌క్కువ స‌మ‌యంలో చాలా కీర్తిని సంపాదించిన ల‌క్కీ గాళ్ గా ర‌ష్మిక పేరు మార్మోగుతోంది. ప‌రాజ‌యాలు లేని క‌థానాయిక‌గా నేష‌న‌ల్ క్ర‌ష్ గా ర‌ష్మిక క్రేజ్ వేరుగా ఉంది. దక్షిణాదిన శ్రీ‌వ‌ల్లిగా బోలెడంత పాపులారిటీని ద‌క్కించుకుంది. పుష్ప చిత్రంతో ఉత్త‌రాదినా త‌న పేరు మార్మోగింది. బాలీవుడ్ స‌హా టాలీవుడ్ లో మెజారిటీ ఫిలింమేక‌ర్స్ ర‌ష్మిక‌ను తమ సినిమాలో చేయాలని కోరుకుంటున్నారు.

కెరీర్ ఆరంభం ఫ్లాపులు ఎదురైనా కానీ నెమ్మ‌దిగా టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ హోదాను అందుకుంది. ఇటీవ‌ల అగ్ర‌హీరోల‌కు ఏకైక ఆప్ష‌న్ గా మారింది. పూజా హెడ్గే సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా వ‌రుస సినిమాల‌లో న‌టిస్తోంది. ఆమె చివరిగా ప్రభాస్ తో కలిసి రాధే శ్యామ్ లో కనిపించింది. ప్ర‌స్తుతం స‌ల్మాన్ స‌ర‌స‌న ఓ భారీ చిత్రంలో న‌టిస్తోంది. త్రివిక్ర‌మ్- మ‌హేష్ చిత్రంలోనూ పూజా క‌థానాయిక‌. ప‌లు ద‌క్షిణాది చిత్రాల‌కు సంత‌కాలు చేసేందుకు సిద్ధంగా ఉంద‌ని స‌మాచారం.

నయనతార సౌత్ లో త‌లైవిగా గుర్తింపు గౌర‌వం అందుకుంటోంది. చాలా కాలంగా బాలీవుడ్ నుంచి ఆఫ‌ర్లు వ‌స్తున్నా తిర‌స్క‌రిస్తోంది. ఉత్త‌రాదినా అత్యంత ఇష్టప‌డే దక్షిణాది నాయికా న‌య‌న్ కి పేరుంది. దక్షిణాది దర్శ‌క‌నిర్మాత‌లకు అత్యంత ఇష్టమైన క‌థానాయిక‌.. అట్లీ  జవాన్ లో సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ తో బాలీవుడ్‌లో అరంగేట్రం చేయనుంది.

మ‌హాన‌టి చిత్రంతో దేశ‌వ్యాప్తంగా గొప్ప న‌టిగా పేరు తెచ్చుకుంది కీర్తి సురేష్‌. న‌టి మేన‌క వార‌సురాలిగా బాల‌న‌టిగా సుప‌రిచితం. కీర్తి సురేష్ దక్షిణాదిలో అత్యంత ఇష్టపడే ప్రజాదరణ పొందిన న‌టిగా పాపుల‌రైంది. ఆమె బాలీవుడ్ అరంగేట్రం కోసం ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నా కానీ దక్షిణాదిలో పని చేయడంపైనే ఎక్కువ దృష్టి పెడుతోంది.  

నిజానికి  క్రేజ్-ప్ర‌తిభ ప‌రంగా సాయిప‌ల్ల‌వికి ఉన్న స్థాయి ఇత‌ర న‌టీమ‌ణుల‌కు లేదు. ఈ భామ ప్ర‌స్తుతానికి సౌత్ కి మాత్ర‌మే ప‌రిమిత‌మైంది. బాలీవుడ్ ప్ర‌య‌త్నాలేవీ చేయ‌లేదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News