బాలీవుడ్ పనైపోలేదు.. అలా ఎన్నటికీ జరగదు: స్టార్ డైరెక్టర్

Update: 2022-05-30 00:30 GMT
బాహుబలి సినిమా చూసిన తర్వాత సౌత్ సినిమా ఇండస్ట్రీ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది అనే చెప్పాలి. ఆ తర్వాత కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన KGF సినిమా అలాగే పుష్ప ఇలా వరుసగా సౌత్ సినిమాలు ఇండియన్ మార్కెట్లో డామినేట్ చేయడం స్టార్ట్ చేసినట్లుగా క్లారిటీ వచ్చేసింది.

ఒక విధంగా బాలీవుడ్ పనైపోయింది అనే విధంగా కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే రొటీన్ కమర్షియల్ ఫార్మాట్ ను మార్చకపోతే బాలీవుడ్ అగ్ర హీరోల కూడా మార్కెట్ కూడా చాలావరకు తగ్గిపోతుంది అనే విధంగా కామెంట్స్ అయితే వచ్చాయి.

అయితే ఈ విషయంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. రీసెంట్ గా బాలీవుడ్ కమర్షియల్ కామెడీ చిత్రాల దర్శకుడు రోహిత్ శెట్టి కూడా సౌత్ నార్త్ సినిమాల వారిపై తనదైన శైలిలో వివరణ ఇచ్చాడు.

చాలా ఏళ్లుగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమ పని అయిపోయింది అన్నట్లుగా ఎన్నో కామెంట్స్ వినిపించాయి. ముఖ్యంగా 1980ల కాలంలో విసిఆర్లు వచ్చినప్పుడు కూడా థియేటర్స్ లోకి ఎవరు రారు అని అన్నారు ఇక ఇటీవల ఓటీటీ కాంటెంట్ ఎక్కువ అయినప్పుడు కూడా అదే తరహా కామెంట్స్ వినిపించాయి.

కానీ అవన్నీ కూడా అబద్ధాలు అని తేలిపోయింది. ప్రేక్షకులు థియేటర్కు వచ్చి సినిమాలను ఒక కొత్త తరహాలో ఎంజాయ్ చేసే విధానం ఎప్పటికీ మారదు. సౌత్ సినిమా లో భారీ స్థాయిలో విజయాన్ని అందుకోవడం సంతోషించదగిన విషయం. అయితే అంతమాత్రాన బాలీవుడ్ చిత్ర పరిశ్రమ పని అయిపోయింది అనుకుంటే కరెక్ట్ కాదు.

ఒకప్పుడు కమల్ హాసన్ కూడా హిందీ చిత్ర పరిశ్రమలో వరుస విజయాలను అందుకున్నారు. సౌత్ సినిమాలు చాలా వరకు హిందీలో రీమేక్ అవుతూనే ఉన్నాయి. అన్ని రకాల సినిమాలను ఆడియన్స్ చూసే విధానం కూడా మారిపోయింది. ఇది ఒక విధంగా సంతోషించాల్సిన విషయమే. కానీ బాలీవుడ్ ను ఇతర చిత్ర పరిశ్రమలు తో పోల్చి చూడటం తోనే కొన్ని నెగటివ్ కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి.. అని రోహిత్ శెట్టి తనదైన శైలిలో సున్నితంగా వివరణ ఇచ్చాడు.
Tags:    

Similar News