నిర్మాతకు తెలియకుండా సినిమా రిలీజ్

Update: 2017-12-29 13:14 GMT
టాలీవుడ్ లో జరిగే కొన్ని సంఘటనలు వింటే ఆశ్చర్యం కాదు షాక్ తో నోటమాట రాని పరిస్థితి వస్తుంది. సరిగ్గా అలాంటిదే ఒకటి ఈ రోజు జరిగింది. సందీప్ కిషన్ - లావణ్య త్రిపాటి జంటగా నటించిన ప్రాజెక్ట్ జెడ్ అనే సినిమా ఈ రోజు విడుదల అయ్యింది. ప్రమోషన్ చేయటంలో చూపించిన నిర్లక్ష్యం కారణంగా ఇది రిలీజ్ అయిన విషయం కూడా అధిక శాతం ప్రేక్షకులకు తెలియలేదు. అందుకే చాలా వీక్ ఓపెనింగ్ తో ఈ రోజు వచ్చిందీ సినిమా. తమిళ్ లో బాగానే ఆడిన మాయవన్ కి ఇది డబ్బింగ్ వెర్షన్. దీని గురించే సందీప్ కిషన్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. తనకు నిర్మాతకు తెలియకుండా అనధికార ప్రింట్ ను ఈ రోజు థియేటర్స్ లో వేసారని - ఇందులో తన వాయిస్ కూడా డబ్ కాలేదని - వేరే ఎవరిదో ఉందని ఆరోపిస్తూ అసలు విడుదలకు తాము క్లియరెన్స్ ఇవ్వలేదని కొత్త ట్విస్ట్ ఇచ్చాడు. ఒక అభిమాని సందీప్ కిషన్ కి సినిమా బాగుంది అని ట్వీట్ చేసే దాకా ఈ విషయమే తెలియలేదట.

ఇక్కడ కొసమెరుపు ఏంటంటే ఇంకా సినిమాకు సిజి వర్క్ - డబ్బింగ్ వర్క్ - నిర్మాత నుంచి క్లియరెన్స్ ఇవేవి ఇవ్వలేదట. మరి ఎవరు రిలీజ్ చేసారు - థియేటర్స్ దాకా ఎలా వెళ్ళింది అనే దాని గురించి విచారణ చేయాలనీ డిమాండ్ చేస్తున్నాడు సందీప్.
Tags:    

Similar News