మ‌రో సారి గొప్ప మ‌న‌సు చాటుకున్న సూర్య‌- జ్యోతిక‌!

Update: 2022-12-11 12:30 GMT
చాలా వ‌ర‌కు స్టార్ హీరోలు, టైర్ టు హీరోలు గుప్త దానాలు చేస్తుంటారు. న‌చ్చిన వారికి న‌చ్చినంత సాయం చేస్తూ త‌మ గొప్ప మ‌న‌సుని చాటుకోవ‌డం తెలిసిందే. అయితే హీరో సూర్య మాత్రం అంద‌రికి భిన్నంగా వ్య‌వహ‌రిస్తూ త‌న గొప్ప మ‌న‌సుని చాటుకుంటూ ప‌ది మందికి ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. మిడిల్‌క్లాస్‌, మిలో బిడిల్ క్లాస్ పిల్ల‌ల కోసం ప్ర‌త్యేకంగా ఓ ట్ర‌స్ట్ ని ఏర్పాటు చేసి స్కూల్ ని ర‌న్ చేస్తున్న పూర్య ఫ్యామిలీ ప్ర‌తీ ఏడాది వారి అభ్యున్న‌తికి పాటు ప‌డుతున్నారు.

అదంగ‌రం ఫౌండేష‌న్ స్కూల్ వార్షికోత్స‌వంలో పిల్ల‌ల‌ హృద్య‌మైన భావోద్వేగ‌పు జీవితాల‌ని, వారు ఎదుర్కొంటున్న విషాద‌క‌ర‌మైన జీవితాల గురించి తెలుసుకుని చ‌లించిపోతున్న సూర్య ఇటీవ‌ల స్టేజ్ పైనే భావోద్వేగానికి గురి కావ‌డం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైర‌ల్ అయ్యాయి కూడా. గ‌త కొన్నేళ్లుగా చెన్నై కి చెందిన పేద పిల్ల‌ల చ‌ద‌వుల కోసం అదంగ‌రం ఫౌండేష‌న్ ద్వారా స‌హాయం చేస్తున్న సూర్య దంప‌తులు తాజాగా మ‌రోసారి త‌మ ఉదార‌త‌ను చాటుకున్నారు.

సూర్య హీరోగా జ్యోతిక 2డీ ఎంట‌ర్ టైన్ మెంట్ బ్యాన‌ర్ పై నిర్మించిన 'జై భీమ్‌' ఓటీటీలో విడుద‌లైన ఈ మూవీ సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించిన విష‌యం తెలిసందే. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని సైతం సొంతం చేసుకున్న ఈ మూవీ త‌రువాత సూర్య‌, జ్యోతికి గిరిజ‌నుల పిల్ల‌ల చ‌దువుల కోసం భారీగా ఖ‌ర్చు చేస్తున్నారు. తాజాగా కోటి రూపాయ‌లు అంద‌జేసి త‌మ గొప్ప మ‌న‌సుని చాటుకుని ప‌లువురిని ఆద‌ర్శంగా నిల‌వ‌డం విశేషం.

ప‌ళ‌న్ కుడి ఇరుల‌ర్ ఎడ్యుకేష‌న‌ల్ ట్ర‌స్ట్ కు త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎం.కె. స్టాలిన్ చేతుల మీదుగా కోటి రూపాయ‌ల చెక్కుని సూర్య‌, జ్యోతిక విరాళంగా అంద‌జేశారు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట షేర్ చేయ‌డంతో ప్ర‌స్తుతం ఈ ఫొటో నెట్టింట వైర‌ల్ గా మారింది. 2006లో సూర్య అగ‌రం ఫౌండేష‌న్ పేరుతో స్వ‌చ్ఛంద సంస్థ ని స్థాపించి త‌మిళ‌నాడు రూర‌ల్ లోని నిరు పేద విద్యార్థుల‌కు చ‌ద‌వు నేర్పిస్తూ సూర్య అండ‌గా నిలుస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News