డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ ప్రముఖ హీరో

Update: 2018-07-07 04:39 GMT
 డ్రంకెన్ డ్రైవ్ లో  శుక్రవారం రాత్రి కూడా ఓ ప్రముఖ హీరో పట్టుబడ్డాడు. ఈ వార్త సంచలనంగా మారింది.  ఫుల్లుగా మధ్యం తాగి కారు నడుపుతూ అడ్డంగా బుక్కయ్యాడు.

గత రాత్రి చెన్నైలోని నూగబాకం పోలీసులు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్  నిర్వహించారు. ఇందులో ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా కుమారుడు - ప్రముఖ నటుడు మనోజ్ బుక్ అయ్యారు. పోలీసులు వాహనాల తనీఖీల్లో భాగంగా మనోజ్ ఖరీదైన బీఎండబ్ల్యూ కారులో వచ్చారు. ఆయన మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు..

సెక్షన్ 185 కింద మనోజ్ పై కేసు నమోదు చేశారు. అలాగే రూ.2500 ఫైన్ విధించి.. కారును సీజ్ చేసిన అనంతరం ఇంటికి వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. మనోజ్ 1999లో ఆయన తండ్రి దర్శకత్వంలో వచ్చిన తాజ్ మహల్ చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తూ హీరోగా ఉన్నారు. మనోజ్ డ్రంకెన్ డ్రైవ్ లో దొరికాడని తెలియగానే తమిళ సినీ ఇండస్ట్రీ షాక్ అయ్యింది.
Tags:    

Similar News