ఎన్టీఆర్ 30 డిలే వెన‌క అస‌లు కార‌ణం ఇదీ

Update: 2022-07-18 05:01 GMT
RRR విడుద‌లై చాలా కాల‌మైంది. దిగ్గ‌జ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో ప్ర‌సారంతో ఈ సినిమా ప్ర‌పంచ దేశాల్లో మ‌న్న‌న‌లు అందుకుంటోంది. ముఖ్యంగా ఇందులో న‌టీన‌టుల‌కు విదేశాల్లో ఇమేజ్ పెరిగింది. ఫాలోయింగ్ కూడా ఏర్ప‌డింది. ఇలాంటి స‌మ‌యంలో ఒక పాన్ ఇండియా  స్టార్ గా తార‌క్ ఎంతో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన స‌న్నివేశం ఉంది.

అందుకే ఇప్పుడు కొర‌టాల‌తో సినిమా అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వుతోంద‌ని స‌మాచారం. ఈ మూవీ కాన్వాస్ అంత‌కంత‌కు పెరుగుతోంద‌ని కూడా గుస‌గుస వినిపిస్తోంది. కొర‌టాల కొన్ని వ‌రుస విజ‌యాల త‌ర్వాత ఆచార్య‌తో బిగ్ ఫ్లాప్ అందుకున్నాడు. ఇది ఊహించ‌నిది. అందుకే దీనినుంచి బ‌య‌ట‌ప‌డేందుకు కొంత స‌మ‌యం ప‌ట్టింద‌ని కూడా గుస‌గుస వినిపిస్తోంది. గ‌తం రిపీట్ కాకూడ‌దు... పైగా తార‌క్ మారిన ఇమేజ్ కి త‌గ్గ‌ట్టే పాన్ ఇండియా కథాంశంతో సినిమా తీయాల్సిన ప‌రిస్థితి ఉంది. అందుకే కొర‌టాల ఆచితూచి అడుగులేస్తున్నార‌ట‌.

స్క్రిప్టు ద‌శ నుంచే దీనిపై అత్యంత శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తున్నార‌ని.. తార‌క్ ని త‌న కెరీర్ ల్యాండ్ మార్క్ మూవీలో పూర్తి వైవిధ్య‌మైన పాత్ర‌లో చూపించ‌నున‌నాడ‌ని టాక్ వినిపిస్తోంది. కార‌ణం ఏదైనా స్క్రిప్ట్ పనులు ఇంకా నెమ్మ‌దిగానే జరుగుతున్నాయి. దీనికోసం ప్ర‌స్తుత ట్రెండ్ లో ఆలోచించే సామ‌ర్థ్యం ఉన్న పాపుల‌ర్ రచయితను ఎంపిక చేసార‌ని కూడా టాక్ వినిపిస్తోంది. త్వ‌ర‌లోనే కొత్త‌ రైట‌ర్ టీమ్ లో జాయిన్ అవుతాడ‌ని వినికిడి. అప్పటి వరకు ఎన్టీఆర్ 30 ప్రీ ప్రొడక్షన్ పనులు పెండింగ్ లో ఉన్నాయ‌ని కూడా గుస‌గుస వినిపిస్తోంది.

ఎన్టీఆర్ ఆర్ట్స్ అధినేత కల్యాణ్ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో క‌థానాయిక ఎవ‌రు? అన్న‌దానికి ఇంకా స‌మాధానం రాలేదు. న‌టీన‌టులు సాంకేతిక నిపుణుల‌కు సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డి కావాల‌సి ఉంది.

క‌థానాయిక ఓకే కాలేదు..!కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఎన్టీఆర్ 30 త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ ఆల‌స్యానికి క‌థానాయిక ఎంపిక కూడా ఒక కార‌ణ‌మ‌ని ఇంత‌కుముందు గుస‌గుస వినిపించింది. ఆర్.ఆర్.ఆర్ న‌టి ఆలియా భ‌ట్ త‌ప్పుకున్న త‌ర్వాత‌ ఈ మూవీలో ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టించే క‌థానాయిక ఎవ‌రు? అన్న‌ది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తారక్ సరసన నటించే హీరోయిన్ కోసం మేకర్స్ ఇంకా వేట కొనసాగిస్తున్నారు.

ఈ మూవీతో బాలీవుడ్ యువ‌నాయిక అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాలు జాన్వీ క‌పూర్ టాలీవుడ్ ఆరంగేట్రం చేస్తుంద‌న్న టాక్ కూడా వినిపించింది. జాన్వీని కొర‌టాల సంప్ర‌దించారు. కానీ అట్నుంచి ఇంకా గ్రీన్ సిగ్న‌ల్ రాలేద‌ని కూడా గుస‌గుస వినిపిస్తోంది. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ జాన్వీ ఖ‌రారు కాలేదు. ఇంత‌లోనే మ‌రో కొత్త పేరు వినిపించింది. టాలెంటెడ్ నటి సాయి పల్లవిని ఒక కీల‌క‌ పాత్ర కోసం మేకర్స్ సంప్రదించగా ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పింద‌ని వార్త‌లొచ్చాయి. మేకర్స్ నుంచి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇటీవల విడుదలైన మోషన్ పోస్టర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News