'వాళ్లిద్దరూ ఇప్పుడు కలిసి ఉండట్లేరు..' స్పష్టం చేసిన హీరో సోదరి

Update: 2020-04-22 01:30 GMT
సాధారణంగా హీరోయిన్లు ఎక్స్ పోజింగ్ చేస్తుంటే అందాలు మాత్రమే హైలైట్ అవుతుంటాయి. కానీ దిశా పటాని మాత్రం అందాలతో పాటు ఫిట్ నెస్ కూడా చూపిస్తుంటుంది. సిక్స్ ప్యాక్ కూడా చూపిస్తుంది. హీరోలు సిక్స్ ప్యాక్ చేస్తే.. తానూ అదే రేంజ్ లో తన బాడీ డెవలప్ చేస్తానని అంటుంది దిశా పటాని. ఫిట్నెస్ హీరోయిన్స్ లిస్ట్ లో ఎప్పుడు ముందే ఉంటుంది. దిశా అందాల ఆరబోతే కాదు.. దాన్ని కాపాడుకోవడం కూడా పక్కాగా చేస్తుంది. ఎప్పుడు జిమ్ లోనే కష్టపడుతూ ఉంటుంది. షూటింగ్స్ లేకపోతె అక్కడే చెమటలు ధారపోస్తుంటుంది. ఎప్పటికప్పుడు తన ఫిట్నెస్ ను మెరుగుపరుచుకుంటూ తన తోటి హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ ఉంటుంది. లోఫర్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన దిశా పటాని తర్వాత కనుమరుగైపోయింది. దానికి కారణం ఆమె చూపులన్నీ బాలీవుడ్ పై ఉండటమే.

బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లి ఎమ్మెస్ ధోని బయోపిక్ లో చిన్న పాత్రలో నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది కానీ, దిశాకు లాభం లేదు. ఇప్పుడు లాక్ డౌన్ లో తన బాయ్ ఫ్రెండ్ టైగర్ ష్రాఫ్ తో కలసి ముంబైలో ఉంటుందని వార్తలు వినిపించాయి. హీరో టైగర్‌ ష్రాఫ్ దిశాపటాని కలిసి ఉంటున్నారన్న వార్తల పై టైగర్‌ ష్రాఫ్ సోదరి కృష్ణ ష్రాఫ్‌ స్పందించింది. వారిద్దరూ ప్రస్తుతం కలిసి జీవించడం లేదని కృష్ణా స్పష్టం చేశారు. దిశాతో కలిసి ఉన్నంతకాలం టైగర్ సంతోషంగా ఉంటాడని ఆమె తెలిపింది. మిజోరాంలో నివసిస్తున్న కృష్ణ లాక్‌ డౌన్‌ వల్ల ప్రస్తుతం అన్నయ్య టైగర్‌ - ప్రియుడు ఎబాన్ హ్యామ్స్‌‌ తో కలిసి ముంబైలో జీవిస్తుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కృష్ణ మాట్లాడుతూ.. దిశా తమతో కలిసి లేదని - కానీ తమ ఇంటి సమీపంలోనే నివసిస్తుందని వెల్లడించింది.
Tags:    

Similar News