టాలీవుడ్ సెన్షేషన్‌ కి ఆమె బయోపిక్ లో చేయాలని ఉందట!

Update: 2022-08-22 04:17 GMT
సీతారామం సినిమా తో టాలీవుడ్‌ లేటెస్ట్‌ సెన్షేషన్ గా పేరు దక్కించుకున్న ముద్దుగుమ్మ మృనాల్‌ ఠాకూర్. బాలీవుడ్‌ నుండి టాలీవుడ్‌ కి దిగుమతి అయిన ఈ అందం ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ మేకర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. హీరోయిన్ గా ఈమె ఓకే చెప్పాలే కాని వరుసగా అరడజను సినిమాలు ఈమె చేతికి వచ్చే అవకాశం ఉంది. ఇంతటి సెన్షేషన్ గా మారిన మృనాల్ ప్రస్తుతం బాలీవుడ్‌ లో నటిస్తోంది.

అక్కడ సినిమాలు చేస్తూనే సౌత్ లో కూడా నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు సీనియర్ హీరోయిన్ మధుబాల బయోపిక్ లో నటించాలని ఉందంటూ పేర్కొంది. ఆమె జీవిత చరిత్ర ను సినిమా గా తీస్తే అందులో ఆమె పాత్రలో నటించడం గౌరవంగా భావిస్తున్నాను అంటూ పేర్కొంది.

సీతారామం సినిమా షూటింగ్‌ సమయంలో చాలా మంది నన్ను మధుబాల తో పోల్చే వారు. ఆ సమయంలో చాలా గర్వంగా అనిపించేది. అప్పుడే నాకు మధుబాల గారి బయోపిక్ లో నటించాలనే కోరిక మొదలు అయ్యిందని చెప్పుకొచ్చింది. సీతారామం సినిమా షూటింగ్‌ సమయంలో మధుబాల గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను అంటూ మృనాల్‌ చెప్పుకొచ్చింది.

సీత పాత్రకు ప్రాణం పోసిన మృనాల్ ఠాకూర్ భవిష్యత్తులో నటిగా మరిన్ని మంచి పాత్రలు.. సినిమాలను దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగు లో ప్రస్తుతం మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన మృనాల్ ఠాకూర్ కోరిక నెరవేరేనా అనేది చూడాలి. మృనాల్‌ ఠాకూర్ ప్రస్తుతం సోషల్‌ మీడియా ద్వారా షేర్ చేసిన ఫోటోలు వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతూనే ఉన్నాయి.
Tags:    

Similar News