అల్లు అర్జున్ యాడ్ ‌పై ట్రోలింగ్

Update: 2021-10-19 02:55 GMT
అల్లు అర్జున్ ప్ర‌స్తుతం పాన్ ఇండియా రేంజ్ మూవీ `పుష్ప‌`లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ రిలీజ్ ‌కి రెడీ అవుతోంది. ఇదిలా వుంటే ఇప్ప‌టికే ప‌లు క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ ‌లో న‌టించిన బ‌న్నీ తాజాగా మ‌రో యాడ్ ఫిల్మ్ ‌లో న‌టించాడు. మ్యాంగో ఫ్రూటీ యాడ్‌ లో బాలీవుడ్ బ్యూటీ అలియా భ‌ట్‌ తో క‌లిసి న‌టించి ఆక‌ట్టుకున్న తాజాగా మ‌రో యాడ్‌ లో ద‌ర్శ‌న‌మిచ్చాడు.

అయితే అది ఇప్పుడు అదే యాడ్‌ పై సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ ఓ రేంజ్ ‌లో న‌డుస్తోంది. అల్లు అర్జున్ ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌ముఖ విద్యా సంస్థ‌గా పేరున్న శ్రీ‌చైత‌న్య జూనియ‌ర్ కాలేజీస్ ‌కి బ్రాండ్ అంబాసిడ‌ర్‌ గా మారిపోయారు. అదీ ఇంట‌ర్మీడియ‌ట్ విద్యా సంస్థ‌ల‌కు బ‌న్నీ బ్రాండ్ అంబాసిడ‌ర్‌ గా మార‌డం ఇదే మొద‌టి సారి. అయితే ఇంట‌ర్మీడియ‌ట్ స్టూడెంట్స్‌ తో క‌లిసి అల్లు అర్జున్ ఈ యాడ్‌ లో పాల్గొన‌డం.. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్ర‌ధాన ప‌త్రిక‌ల్లో ప‌తాక శీర్షిక‌న వెలువ‌డ‌టంతో బ‌న్నీపై ట్రోలింగ్ మొద‌లైంది.

శ్రీ‌చైత‌న్య విద్యాసంస్థ‌ల‌కు సంబంధించిన యాడ్ క్యాపెయిన్‌ లో అల్లు అర్జున్ డ‌బుల్ ఐటీ ర్య‌కాంక‌ర్‌ల‌తో క‌లిసి న‌టించ‌డం... అలాగే `ఆల్ ఇండియా IIT నంబ‌ర్ వ‌న్ ర్యాంక్‌` బ‌న్నీ ప‌క్క‌నే నిల‌బ‌డి వుండ‌టంతో ఈ ఇమేజ్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ గా మారి ట్రోల్ అవుతోంది. న‌టుడిగా బిజీగా వుండి ఈ వ‌య‌సులో బ‌న్నీ IIT నంబ‌ర్ వ‌న్ ర్యాంక్ ని సాధించ‌డం అంత సులువేమీ కాదు. అంటూ బ‌న్నీని ట్రోల్ చేస్తున్నారు.

గ‌త కొంంత కాలంగా మావే అన్ని ర్యాంకులు అంటూ స‌ద‌రు విద్యాసంస్థ‌లు టీవీల్లోనూ.. పేప‌ర్ల‌లోనూ ప్ర‌క‌ట‌న‌లు కుమ్మేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌క‌ట‌న‌ల‌పై ప్ర‌తీ ఏడాది ట్రోలింగ్ జ‌రుగుతూనే వుంది.
ఈ విష‌యం బ‌న్నీకి తెలియ‌నిది కాదు. ఇది తెలిసి కూడా బ‌న్నీ ఇలాంటి యాడ్‌లో న‌టించ‌డం అభిమానుల‌కు రుచించ‌డం లేద‌ట‌. అయితే బ‌న్నీ అన్నీ తెలిసి ఈ యాడ్‌లో న‌టించ‌డానికి ప్ర‌ధాన కార‌ణం భారీ స్థాయిలో శ్రీ‌చైత‌న్య సంస్థ‌లు అత‌నికి రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌డ‌మేన‌ని తెలిసింది.


Tags:    

Similar News