బిగ్ డెసిషన్ తీసుకున్న 'వకీల్ సాబ్' డైరెక్టర్..?

Update: 2021-05-17 09:30 GMT
డైరెక్టర్ వేణు శ్రీరామ్ 'వకీల్ సాబ్' సినిమాతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు. 'ఓ మై ఫ్రెండ్' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వేణు.. అది ప్లాప్ అవడంతో ఆరేళ్ళ పాటు అవకాశాలకు దూరం అయ్యాడు. అయితే 'ఎంసీఏ' సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న వేణు.. అల్లు అర్జున్ తో 'ఐకాన్' ప్రాజెక్ట్ ప్రకటించారు. అనివార్య కారణాల వల్ల అది సెట్స్ పైకి వెళ్ళనప్పటికీ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే ఛాన్స్ అందుకున్నాడు. 'పింక్' రీమేక్ ని పవన్ కు తగ్గట్లుగా మార్పులు చేసి 'వకీల్ సాబ్' తో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ పడేళ్లలో శ్రీరామ్ వేణు చేసిన మూడు సినిమాలు కూడా దిల్ రాజు ప్రొడక్షన్ లోనే అవడం గమనార్హం.

'వకీల్ సాబ్' సక్సెస్ తర్వాత వేణు శ్రీరామ్ నెక్స్ట్ చేయబోయే సినిమా 'ఐకాన్' అని దిల్ రాజు అనౌన్స్ చేశాడు. వేణు సైతం ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తదుపరి సినిమాలో హీరో ఎవరో చెప్పనప్పటికీ.. 'ఐకాన్' మీదే వర్క్ చేయబోతున్నట్లు వెల్లడించారు. అయితే ఫిల్మ్ సర్కిల్స్ లో తాజాగా వినిపిస్తోన్న టాక్ ప్రకారం దిల్ రాజు కాంపౌండ్ నుంచి వేణు శ్రీరామ్ బయటకు రావాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. 'వకీల్ సాబ్' చిత్రానికి మంత్లీ సాలరీ తీసుకొని వర్క్ చేసిన వేణు.. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలపై అసంతృప్తిగా ఉన్నాడట. ఈ క్రమంలోనే రీసెంటుగా ఓ స్టార్ హీరోని కలిసి స్క్రిప్ట్ నెరేట్ చేశాడని టాక్ వినిపిస్తోంది.

నిజానికి 'వకీల్ సాబ్' తర్వాత వేణు శ్రీరామ్ కు వరుస క్రేజీ ఆఫ‌ర్లు తలుపుతట్టాయి. ఈ మధ్య డైరెక్టర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పెద్ద నిర్మాణ సంస్థల నుంచి ఆఫర్స్ వస్తున్నాయి.. కాకపోతే అడ్వాన్సులు ఎవరి దగ్గర తీసుకోలేదు.. దిల్ రాజు బ్యానర్ లోనే కాకుండా ఇతర ప్రొడక్షన్ హౌస్ లలో కూడా సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పాడు. ఈ నేపథ్యంలో వేణు ప్రస్తుతం రెండు పెద్ద నిర్మాణ సంస్థలతో చర్చలు జరుపుతున్నారట. పరిస్థితులు చక్కబడిన తర్వాత వేణు శ్రీరామ్ తదుపరి ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన ఉంటుందని టాక్. ఇందులో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.
Tags:    

Similar News