చిరు మరో రీమేక్.. డైరెక్టర్ అతనే!

Update: 2023-01-19 13:30 GMT
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సొంతం చేసుకున్నాడు. పండుగ సీజన్లో దాదాపు బాలకృష్ణపై పైచేయు సాధించిన మెగాస్టార్ తన కెరీర్ లో మరోసారి 100 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ సొంతం చేసుకోవడం విశేషం. విడుదలైన అన్ని ఏరియాలలోను ఈ సినిమా ప్రాఫిట్ అందించే విధంగా కొనసాగుతోంది.

అయితే మెగాస్టార్ చిరంజీవి ఒక స్ట్రైట్ సినిమా తో పాటు మళ్ళీ ఒక రీమేక్ సినిమాలు చేసే విధంగా తనకే కెరీర్ సెట్ చేసుకుంటున్నాడు అనిపిస్తోంది. ఇంతకుముందు గాడ్ ఫాదర్ సినిమాతో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు స్ట్రైట్ తెలుగు సినిమా వాల్తేరు వీరయ్య తో వచ్చాడు. అయితే ఇప్పుడు మళ్లీ అతను లైనప్ లో మరొక తమిళ్ రీమేక్ సినిమాను తీసుకురాబోతున్నట్లుగా టాక్ అయితే వినిపిస్తోంది.

ఇదివరకే మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 అలాగే గాడ్ ఫాదర్ తో పాటు ఇప్పుడు చేస్తున్న భోళా శంకర్ కూడా రీమేక్ కథనే. అయితే ఇప్పుడు మరోసారి అజిత్ తమిళ సినిమా కథను రీమేక్ చేయాలని మెగాస్టార్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

భోళా శంకర్ సినిమా వేదళం సినిమాకు రీమేక్ గా వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అజిత్ విశ్వాసం సినిమాను కూడా రీమేక్ చేయాలని అనుకుంటున్నారట.

ఇక ఈ సినిమాకు దర్శకుడిగా మాస్ డైరెక్టర్ వివి వినాయక్ ఫిక్స్ అయినట్లుగా ఒక టాక్ అయితే వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో ఠాగూర్, ఖైదీ నెంబర్ 150 సినిమాలు తెరపైకి తీసుకువచ్చిన వివి వినాయక్ ఈసారి మళ్లీ అన్నయ్యతోనే మరొక కథను సెట్ పెంచుకోవడం విశేషం. వినాయక్ గత కొంతకాలంగా సరైన విజయాలు లేక సతమతమవుతున్నాడు.

ఎంతమంది స్టార్ హీరోలకు కథలు చెప్పినా కూడా ఎవరు ఒప్పుకోవడం లేదు. ఇక ఈ తరుణంలో మెగాస్టార్ చిరంజీవి పిలిచి మరీ అతనికి అవకాశం ఇస్తున్నారు. మరోవైపు వినాయక్ బెల్లంకొండ శ్రీనివాస్ తో చేసిన చత్రపతి హిందీ రీమేక్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.  



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News