గురు శిష్యుల యుద్ధం - ట్రైలర్ టాక్

Update: 2019-08-27 05:43 GMT
కండల వీరుడు హృతిక్ రోషన్ మాస్ హీరో టైగర్ ష్రాఫ్ కాంబినేషన్ లో రూపొందిన మల్టీ స్టారర్ వార్ ట్రైలర్ ఇందాకా విడుదల చేశారు. కథేంటో కూడా స్పష్టంగా చెప్పేశారు. కబీర్(హృతిక్ రోషన్)ఒకప్పుడు భారత రక్షణ శాఖలో అత్యున్నత పదవిని అలంకరించి గొప్ప గుర్తింపు తెచ్చుకుని ఉంటాడు. కానీ ఏవో సంఘటనల వల్ల అందులో నుంచి బయటికి వచ్చి దేశ భద్రతకు ముప్పుగా మారతాడు. ఇతన్ని పట్టుకునే మిషన్ మీద కబీర్ దగ్గరే ఒకప్పుడు శిక్షణ తీసుకున్న ఖలీద్(టైగర్ ష్రాఫ్)ను రంగంలోకి దించుతారు.

ఇక అక్కడి నుంచి సింహం పులి మధ్య వేట మొదలవుతుంది. తనను పట్టుకోవడం కోసం వచ్చిన ఖలీద్ కు కబీర్ పెద్ద సవాల్ గా మారతాడు. ఇద్దరికీ భయంకరమైన ప్రమాదాలు ఎదురవుతాయి. మరి గురుశిష్యులు బద్ద శత్రువులగా మారడానికి కారణాలు ఏమిటి అసలు కబీర్ అలా ఎందుకయ్యాడు ఖలీద్ చివరికి అతన్ని పట్టుకున్నాడా లేదా అనేదే వార్ కథ

ట్రైలర్ లో సాంకేతిక విషయాలకు వస్తే మైండ్ బ్లోయింగ్ అని చెప్పక తప్పదు. విజువల్స్ తో పాటు యాక్షన్ సీన్స్ ని చిత్రీకరించిన తీరు ఈ మధ్యకాలంలో సాహో తర్వాత ఇదే ది బెస్ట్ అని చెప్పొచ్చు. సిద్దార్ట్ ఆనంద్ టేకింగ్ ఇంకో లెవెల్ లో ఉండగా బెంజమిన్ జాస్పర్ ఛాయాగ్రహణం హాలీవుడ్ స్టాండర్డ్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉంది.

యాక్షన్ ప్రియులకు ఫుల్ మీల్స్ లా అనిపిస్తున్న వార్ ని సౌత్ లోనూ డబ్బింగ్ రూపంలో విడుదల చేస్తున్నారు.  నిర్మాణ విలువల్లో ఏ మాత్రం రాజీ పడకుండా కోట్లాది రూపాయల బడ్జెట్ తో యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన వార్ టైటిల్ కు తగ్గట్టే అదిరిపోయే పోరాట దృశ్యాలతో కనువిందు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానున్న వార్ మీద అంచనాలు రెట్టింపు అయ్యేలా ట్రైలర్ కట్ చేయడం విశేషం.



Full View
Tags:    

Similar News