పిక్ టాక్ : ఈ నార్త్‌ సౌత్‌ ముద్దుగుమ్మల ఫ్రెండ్‌ షిప్ ఎక్కడ స్టార్ట్‌ అయ్యింది?

Update: 2022-11-03 10:30 GMT
జాన్వీ కపూర్‌ ఇప్పటి వరకు సౌత్ సినిమాల్లో నటించలేదు.. ఆమె అసలు సౌత్‌ సినిమాల్లో నటిస్తుందా అనే విషయమై క్లారిటీ రావడం లేదు. ఇదే సమయంలో మహానటి తో సౌత్‌ తో మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా కీర్తి సురేష్ నిలిచిన విషయం తెల్సిందే.

ఈ ముద్దుగుమ్మలు ఇద్దరు కూడా వేరు వేరు దృవాలకు చెందిన వారు. అయితే ఇద్దరు కూడా ఇలా కలిసి అందరి దృష్టిని ఆకర్షించారు. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మాదిరిగా ఫోటోలకు వీరిద్దరు ఫోజ్ ఇవ్వడంతో వీరిద్దరి మధ్య స్నేహం ఎప్పటి నుండి.. ఎలా మొదలు అయ్యి ఉంటుంది అంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు.

జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా హిందీలో వరుసగా సినిమాల్లో నటిస్తూ ఉంది.. మరో వైపు కీర్తి సురేష్ కూడా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంది. వీరిద్దరు ఇప్పటి వరకు కలిసి నటించింది లేదు.. గతంలో పెద్దగా కలిసి సందడి చేసింది లేదు. కానీ తాజాగా వీరిద్దరు చాలా క్లోజ్ గా ఉన్న ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

కీర్తి సురేష్ ఈ ఫోటోను సోషల్‌ మీడియా ద్వారా షేర్ చేసింది. మిలీ సినిమా విడుదల సందర్భంగా జాన్వీ కపూర్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ కీర్తి సురేష్ ఈ ఫోటోను మీడియా ముందుకు తీసుకు రావడంతో ఇద్దరి మధ్య ఇంత మంచి స్నేహం ఉందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

జాన్వీ కపూర్‌ ప్రస్తుతం బాలీవుడ్‌ కే పరిమితం అయినా కూడా ఆమె తల్లి శ్రీదేవికి సౌత్‌ లో చాలా సన్నిహిత పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాల కారణంగానే జాన్వీ కపూర్‌.. కీర్తి సురేష్ క్లోజ్ ఫ్రెండ్స్ గా మారి ఉంటారు అనేది టాక్‌. మొత్తానికి ఈ ఇద్దరు ముద్దుగుమ్మలను ఇలా చూస్తూ ఉంటే ముచ్చటేస్తుంది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News