.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

బెల్లంకొండ కొత్త ప్రాజెక్ట్.. హీరోయిన్ ఎవరో తెలుసా?

ఓవైపు టైసన్ నాయుడు షూటింగ్ జరుగుతుండగా.. ఇప్పుడు మరో మూవీ స్టార్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు శ్రీనివాస్

Update: 2024-06-30 12:07 GMT

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ప్రముఖ నిర్మాత సురేష్ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. చివరగా ప్రభాస్ సూపర్ హిట్ మూవీ ఛత్రపతిని బాలీవుడ్ లో రీమేక్ చేసి ఫ్లాప్ ను మూటగట్టుకున్న ఆయన.. ఇప్పుడు సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం భీమ్లా నాయక్ మూవీ ఫేమ్ సాగర్ కే చంద్రతో టైసన్ నాయుడు సినిమా చేస్తున్నారు.

ఓవైపు టైసన్ నాయుడు షూటింగ్ జరుగుతుండగా.. ఇప్పుడు మరో మూవీ స్టార్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు శ్రీనివాస్. అందుకు సంబంధించిన అఫీషియల్ అప్డేట్ వచ్చింది. చావు కబురు చల్లగా డైరెక్టర్ కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆ సినిమాను సాహు గారపాటి నిర్మించనున్నారు. రేపు ఉదయం పదిన్నర గంటలకు పూజా కార్యక్రమాలతో సినిమా మొదలుకానున్నట్టు మేకర్స్ ప్రకటించారు. శ్రీనివాస్ కూడా షేర్ చేశారు.

'దైవ ఆశీర్వాదాలతో ఉత్తేజకరమైన ప్రారంభం' అంటూ మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్ తో పాటు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. పోస్టర్ మంచి ఇంట్రెస్టింగ్ గా ఆకట్టుకుంటోంది. మధ్యలో సెల్ టవర్, అటు వైపు ఓ పెద్ద ఈగ వెళ్తున్నట్టుగా చూపించారు. కామిక్ టైప్ లా రెండు చేతులు అటు ఇటు ఉన్నాయి. మొత్తానికి పోస్టర్ ను చూస్తుంటే సాయి శ్రీనివాస్ BSS 11 సినిమా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతోంది.

ఈ మూవీ టైటిల్ ను కిష్కిందపురిగా ఫిక్స్ చేసినట్లు ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది. కానీ మేకర్స్ ఇంకా ఫిక్స్ చేయలేదని లేటెస్ట్ టాక్. కొత్త టైటిల్ కోసం వెతుకుతున్నారని వినికిడి. అయితే ఈ సినిమాలో సాయి శ్రీనివాస్ సరసన మాలీవుడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే వీరిద్దరు కాలిసి రాక్షసుడు మూవీలో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి కలిసి యాక్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు శ్రీనివాస్, అనుపమ.

సూపర్ హిట్ కాంబో రిపీట్ అవుతుండడంతో మూవీపై మంచి అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. కాంతార, విరూపాక్ష, మంగళవారం వంటి పలు సినిమాలకు వర్క్ చేసిన ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందించనున్నారు. సినిమాటోగ్రాఫర్ గా చిన్మయి సలస్కర్, ప్రొడక్షన్ డిజైనర్ గా మనీషా ఏ దత్ వ్యవహరించనున్నారు. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ ఇవ్వనున్నారు మేకర్స్. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది.

Tags:    

Similar News