బ‌న్నీపై ట్రోలింగ్ గెలిస్తే మ‌రోలా ఉండేదా?

ఇక‌పై బ‌న్నీ నుంచి ఏ సినిమా రిలీజ్ అయిన అది పాన్ ఇండియాలోనే ఉంటుంది.

Update: 2024-06-05 09:12 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏ రేంజ్ హీరో అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. 'పుష్ప' స‌క్సెస్ తో పాన్ ఇండియాలోకి వెళ్లిపోయాడు. `పుష్ప‌-2` హిట్ అయితే ఆ రేంజ్ అంత‌కంత‌కు రెట్టింపు అవుతుంది. జాతీయ ఉత్త‌మ న‌టుడిగానూ అవార్డు అందుకున్నారు. ఇక‌పై బ‌న్నీ నుంచి ఏ సినిమా రిలీజ్ అయిన అది పాన్ ఇండియాలోనే ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో బ‌న్నీ ట్రోల‌ర్ల‌కి అడ్డంగా దొరికిపోయాడు.

ఇటీవ‌లే నంద్యాల అభ్య‌ర్ధి త‌రుపున బ‌న్నీ మ‌ద్ద‌తిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మ‌ద్ద‌తుతో ఎన్నిర‌కాల విమ‌ర్శ‌లు ఎదుర్కున్నాడో కూడా తెలిసిందే. మెగా ఫ్యామిలీ తో బాండింగ్ చెండిద‌ని ఓవైపు ప్ర‌చారం..అదే ఫ్యామిలీకి చెందిన అభిమానులు ఆయ‌న్ని విమ‌ర్శించ‌డం జ‌రిగింది. అయితే ఇప్పుడా విమ‌ర్శ‌లు ట్రోలింగ్ స్టేజ్ కి చేరుకున్నాయి. నంద్యాల వైకాపా అభ్య‌ర్ధి ఓడిపోవ‌డంతో బ‌న్నీ సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.

ప్ర‌భాస్ మ‌ద్ద‌తిచ్చిన అభ్య‌ర్ధి గెలిచాడు. చ‌ర‌ణ్, వ‌రుణ్ తేజ్ మ‌ద్ద‌తిచ్చిన బాబాయ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గెలిచాడు. ఇంకా పీకేకి ఎవ‌రైతే మ‌ద్ద‌తిచ్చిరో వారంద‌రు పేర్లు ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతున్నారు. కానీ బ‌న్నీని మాత్రం స్నేహితుడు అనే కార‌ణంగా మ‌ద్ద‌తిచ్చిన అభ్య‌ర్ధి ఓడిపోవ‌డంతో ఎవ‌రి స్టైల్లో వారు చెల‌రేగుతున్నారు. ఓ రాజ‌కీయ నామ‌కుడుకి స్నేహితుడు అనే కార‌ణంగా మద్ద‌తివ్వ‌డంతోనే ఇలా జ‌రిగింది. ఇంత‌వ‌ర‌కూ బ‌న్నీ ఇలాంటి స‌న్నివేశం ఎప్పుడు ఎదుర్కోలేదు. ఒక‌వేళ గెలిస్తే ఈ ప‌రిస్థితి ఉడేది కాదేమో.

మ‌రి ఈ ట్రోలింగ్ బ‌న్నీ రియాక్ష‌న్ ఉంటుందా? ఉండ‌దా? అన్న‌ది చూడాలి. ప్ర‌స్తుతం ఐకాన్ స్టార్ `పుష్ప‌-2` షూటింగ్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈసినిమా షూటింగ్ క్లైమాక్స్ కి చేరుకుంది. అన్ని ప‌నులు పూర్తి చేసి ఆగ‌స్టు 15న రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది.

Tags:    

Similar News