దేవర.. ఇదే కంటిన్యూ అయితే చాలు!

బ్లాక్ బస్టర్ హిట్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

Update: 2024-08-27 16:30 GMT

బ్లాక్ బస్టర్ హిట్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. కోస్టల్ బ్యాక్ డ్రాప్ తో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ.. హై ఓల్టేజ్ యాక్షన్ తో తెరకెక్కిస్తున్నారు. జనతా గ్యారేజ్ వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత తారక్, కొరటాల కాంబోలో మూవీ తెరకెక్కుతుండడంతో.. ఫ్యాన్స్ తోపాటు సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండు భాగాలుగా సినిమాను రిలీజ్ చేయనున్నారు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న దేవర పార్ట్-1.. మరో నెల రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 27వ తేదీన గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ఇటీవల తన షూటింగ్ పార్ట్ ను తారక్ పూర్తి చేశారు. మిగతా పార్ట్ ను మేకర్స్ త్వరగా కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ తోపాటు రెండు సాంగ్స్ అదిరిపోయే రెస్పాన్స్ అందుకున్నాయి. మంచి బజ్ క్రియేట్ చేశాయి.

తాజాగా మేకర్స్ మరో సర్ప్రైజ్ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ రెండు డిఫరెంట్ గెటప్‌ లతో ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేశారు. నెల రోజుల్లో అతడి రాక ప్రపంచాన్ని కదిలించబోతుందంటూ అంచనాలు పెంచారు. అయితే ఎన్టీఆర్ సముద్రం దగ్గర పది ఊర్లకు కాపరిగా ఉంటాడని చెప్పి ఓ జూనియర్ ఆర్టిస్ట్ కొద్ది రోజుల క్రితం స్టోరీని లీక్ చేశారు. అంతకుమించి దేవర మూవీ స్టోరీకి సంబంధించి ఎలాంటి లీక్స్ రాలేదు.

అయితే రీసెంట్ గా విదేశాల్లో దేవర అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. అందులో భాగంగా టికెట్ బుకింగ్ ప్లాట్ ఫాంలో సింపుల్ గా స్టోరీ లైన్ మెన్షన్ చేశారు. 'తీర ప్రాంత భూమిలో జరిగిన ఘటనల చుట్టూ సినిమా సాగుతుంది. భావోద్వేగంతో కూడిన సంఘటనలు ఉన్నాయి. హీరో నిరాశ్రయులకు రక్షకునిగా పొరాడుతాడు' అని రాసుకొచారు. పూర్తిగా స్టోరీ ఏంటనేది క్లియర్ గా అర్థం కాకపోయినా జస్ట్ మెన్షన్ చేశారు.

ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియా లో ఫుల్ వైరల్ అవుతోంది. అయితే ట్రైలర్ రిలీజ్ వరకు స్టోరీ విషయంలో మేకర్స్ ఇలా కంటిన్యూ చేస్తే చాలని అంటున్నారు. ఇక సినిమా విషయానికొస్తే.. నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా భారీగా నిర్మిస్తున్నాయి. యంగ్ సెన్సేషన్ అనిరుధ్ రవి చందర్ సంగీతం అందిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌ గా నటిస్తున్నారు.. మరి ఈ మూవీ ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News