మ్యారేజ్ డే కోసం వెళ్తే మొత్తం దోచేసారు!

పెళ్లిరోజును గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేసుకుందామ‌ని ఓ బాలీవుడ్ జంట యూర‌ప్ ట్రిప్ కి వెళ్లింది

Update: 2024-07-12 05:31 GMT

పెళ్లిరోజును గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేసుకుందామ‌ని ఓ బాలీవుడ్ జంట యూర‌ప్ ట్రిప్ కి వెళ్లింది. చుట్టూ ఉన్న ప్రాంతాల‌న్ని చుట్టొచ్చి ఎంచ‌క్కా సెల‌బ్రేష‌న్ లో మునిగి తేల్దామ‌నుకున్నారు. ఉన్న‌ది ఇద్ద‌రే. ఎలాంటి డిస్ట‌బెన్స్ ఉండ‌దు. పార్టీ చేసుకుని చిల్ అవుదాం అనుకున్నారు. కానీ ఇంత‌లోనే చేదు అనుభ‌వం ఎదురైంది. సెల‌బ్రేష‌న్స్ కోస‌మెళ్తే ఏకంగా ఆ మూడ్ లేకుండానే అయిపోయింది. ఇంత‌కీ ఎవ‌రా జోడీ? ఏం జ‌రిగిందంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.

`యే హై మొహ‌బ‌త్తీన్` సీరియ‌ల్ తో దివ్యాంక త్రిపాఠి బాగా ఫేమ‌స్ అయింది. సీరియ‌ల్ న‌టిగా ఆమెకి మంచి గుర్తింపు ఉంది. 2016 లో స‌హ న‌టుడు వివేక దూహియాని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్ప‌టి నుంచి ఏటా మ్యారేజ్ డే ని గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా ఈ ఏడాది సెల‌బ్రేష‌న్ యూరప్ లో ప్లాన్ చేసుకున్నారు. స్విట్జ‌ర్లాండ్ లో ఎంజాయ్ చేసిన ఫోటోలు కూడా అభిమానుల‌తో పంచుకున్నారు.

అయితే ప్లోరెన్స్ అనే ఊరిలో ఓ రోజు ఉండేందుకు ప్లాన్ చేసుకున్నాను. ఓ ఇల్లు కోసం వెతికే క్ర‌మంలో వ‌చ్చిన కారుని రోడ్డు మీద‌నే వ‌దిలేసారు. దీంతో ఆ కారులో దొంగ‌లు ప‌డ్డారు. కారు అద్దాలు ధ్వసం చేసి కారులో ఉన్న హ్యాండ్ హ్యాగ్, డ‌బ్బులున్న ప‌ర్స‌న్ , విలువైన వ‌స్తువుల‌న్నింటి దొంగిలించారు. దీంతో ఇద్ద‌రు దిక్కు తోచ‌ని స్థితిలో ప‌డ్డారు. అంతా షాక్ లోకి వెళ్లిపోయారు. దేశం కాని దేశంలో ఇలాంటి స‌మ‌స్య ఏంటి దేవుడా? అనుకున్నారు.

ఆ కాసేప‌టికి కోలుకుని స‌మీపంలో ఉన్న పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేసారు. అయితే దొంగ‌త‌నం జ‌రిగిన ప్రాంతంలో సీసీ క‌వ‌రేజ్ లేదు. దీంతో పోలీసులు ఏం చేయ‌లేమ‌ని చేతులెత్తేసారు. దీంతో అక్క‌డ నుంచి ఎలాగైన బ‌య‌ట ప‌డాలి అనే ఉద్దేశంతో టెంప‌ర‌రీ పాస్ పోర్ట్ కోసం ప్ర‌యత్నాలు మొద‌లు పెట్టారు. దొంగ‌తనం జ‌రిగిన రోజు ఎంబ‌సీకి వెళ్ల‌గా అది మూసేసి ఉంది. దీంతో తాత్కాలిక పాస్ పోర్ట్ మీద ఎలాగైనా స్వ‌దేశానికి చేరుకునే ఇత‌ర మార్గాలు అన్వేషిస్తున్నారు. మ‌రో నాలుగైదు రోజుల్లో ఇండియాకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

Tags:    

Similar News