సంక్రాంతి రేస్.. సగానికిపైగా చరణ్ కేనా?

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

Update: 2024-10-20 17:30 GMT

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా షూటింగ్ రీసెంట్ గా పూర్తి అయినట్లు తెలుస్తోంది. సామాజిక సందేశానికి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ ను జోడించి శంకర్ తెర‌కెక్కిస్తున్నట్లు స‌మాచారం. ఐఏఎస్ ఆఫీసర్ గా, అన్యాయంపై పోరాటం చేసే యువ‌కుడిగా రెండు డిఫ‌రెంట్ షేడ్స్‌ తో కూడిన క్యారెక్ట‌ర్‌ లో రామ్‌ చ‌ర‌ణ్‌ సినిమాలో కనిపించనున్నారట.

మూవీలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వానీ, తెలుగమ్మాయి అంజలి నటిస్తున్నారు. శ్రీకాంత్, నవీన్ చంద్ర, ఎస్‌ జే సూర్య కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. అయితే డిసెంబర్ లో మూవీని రిలీజ్ చేద్దామని మేకర్స్ తొలుత భావించినా.. ఆ తర్వాత సంక్రాంతికి షిఫ్ట్ చేశారు. కొడుకు సినిమా కోసం త‌న చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి వాయిదా వేసుకోగా.. జనవరి 10వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది గేమ్ ఛేంజర్.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై గేమ్ ఛేంజర్ ను నిర్మిస్తున్న దిల్ రాజు.. సినిమాపై మంచి హోప్స్ పెట్టుకున్నారు. భారీ హిట్ అందుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 50 శాతానికి పైగా థియేటర్లలో సినిమా రిలీజ్ చేసేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బెనిఫిట్ షోలు, ఎర్లీ మార్నింగ్ షోలు వేయాలని చూస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. టికెట్ ధరల పెంపు విషయంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరనున్నట్లు సమాచారం.

అయితే పండుగల సీజన్ ను దృష్టిలో పెట్టుకుని.. టికెట్ రేట్ల పెంపు, ఎక్స్ ట్రా షోలకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం దాదాపు ఖరారే. దీంతో పెద్ద ఎత్తున గేమ్ ఛేంజర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సిద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇక గేమ్ ఛేంజర్ తర్వాత.. బాలయ్య NBK 109 మూవీకి దాదాపు 25 శాతం థియేటర్లు దక్కనున్నాయని వార్తలు వస్తున్నాయి. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఆ సినిమా షూటింగ్ ఇప్పుడు చివరి దశలో ఉంది

సంక్రాంతికి చరణ్, బాలయ్య చిత్రాలతోపాటు నాగచైతన్య తండేల్ మూవీ రిలీజ్ కానున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. గేమ్ ఛేంజర్, NBK 109కు కేటాయింపులు జరిగాక మిగిలిన థియేటర్లలో ఎక్కువ భాగం తండేల్ కు దక్కుతాయట. కానీ మేకర్స్.. తండేల్ విడుదల విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటికే ఖరారైన వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమా పోస్ట్ పోన్ అయ్యేలా కనిపిస్తుంది. మరి చివరకు సంక్రాంతికి ఏ సినిమా ఎన్ని థియేటర్లలో రిలీజ్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News