గుంటూరు కారం.. ఆ కిక్కు మాత్రం పక్కా..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం.

Update: 2023-12-10 11:18 GMT

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. చాలా రోజుల తర్వాత మహేశ్ పక్కా మాస్ అండ్ కమర్షియల్ సినిమా చేస్తుండడంతో ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సినిమాలోని తొలి పాటను రిలీజ్ చేసిన చిత్ర యానిట్.. డిసెంబర్ 13వ తేదీన మరో సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త చక్కర్లు కొడుతోంది. గుంటూరు మిర్చి యార్డు నేపథ్యంలో యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో మాస్ మసాలా ఐటెమ్ సాంగ్ పక్కాగా ఉంటుందట. అందుకు భారీ ఎత్తున ప్లాన్ చేశారట త్రివిక్రమ్.

ఆ ఐటమ్ సాంగ్ కోసం ఓ స్టార్ హీరోయిన్ ను తివిక్రమ్ రంగంలోకి దించుతున్నారట. అందుకే సాంగ్ కు తగ్గట్లు హీరోయిన్ కోసం వెతుకుతున్నారట. హీరోయిన్ దొరకకగానే షూట్ ప్రారంభిస్తారట. ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ ఆ పాటకు కొరియోగ్రఫీ అందించనున్నారట. అయితే ఈ సాంగ్ పై అఫీషియల్ ప్రకటన రాకపోయినప్పటికీ.. త్రివిక్రమ్ మాత్రం ఈ సాంగ్ థియటర్స్లో ఫ్యాన్స్ కు కారం ఘాటు చూపించేలా ప్లాన్ చేశాడని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

అయితే ఈ ఐటమ్ సాంగ్ గురించి సినిమా రిలీజ్ వరకు సీక్రెట్ గా ఉంచాలని డిసైడ్ అయ్యారట త్రివిక్రమ్. అంతవరకు ఎటువంటి పోస్టర్ గానీ, ఐటెమ్ సాంగ్ హింట్స్ గానీ రిలీజ్ చేయకుండా డైరెక్ట్ గా థియేటర్స్లోనే ఆడియన్స్ చేత ఈలలు వేయించాలని త్రివిక్రమ్ ఫిక్సయ్యారట.

సినిమా విషయానికొస్తే.. మహేశ్ కు జోడీగా శ్రీలీల నటిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పై చినబాబు, సూర్యదేవర నాగవంశీ సంయక్తంగా నిర్మిస్తున్నారు. జగపతి బాబు విలన్‌గా నటిస్తున్న ఈ మూవీలో బ్రహ్మానందం ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. రమ్యకృష్ణ, రఘుబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, జయరామ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ బాణీలు అందిస్తున్నారు. దీంతో సాంగ్స్ పై ఫ్యాన్స్ లో ఫుల్ క్యూరియాసిటీ పెరిగింది. అయితే ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం.

Tags:    

Similar News