దేవర మీదే జాన్వి ఆశలన్నీ..?

బాలీవుడ్ భామ జాన్వి కపూర్ లేటెస్ట్ మూవీ మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమాపై భారీ హోప్ పెట్టుకోగా అది కాస్త మిస్ ఫైర్ అయ్యింది

Update: 2024-06-04 03:45 GMT

బాలీవుడ్ భామ జాన్వి కపూర్ లేటెస్ట్ మూవీ మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమాపై భారీ హోప్ పెట్టుకోగా అది కాస్త మిస్ ఫైర్ అయ్యింది. శరణ్ శర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. సినిమా కథ, కథనం ఏది ఆడియన్స్ ని రీచ్ కాలేదని చెబుతున్నారు. ఇదిలాఉంటే జాన్వి కపూర్ కెరీర్ సౌత్ సినిమాల మీద డిపెండ్ అయ్యింది. తెలుగులో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో దేవర సినిమాతో ఎంట్రీ ఇస్తున్న అమ్మడు ఈ సినిమా మీదే చాలా నమ్మకం పెట్టుకుంది.

ఎన్.టి.ఆర్ తో సినిమా సైన్ చేసే టైం లో సౌత్ సినిమాలకు ఇది సరైన టైమా కాదా అని ఒకటికి రెండుసార్లు ఆలోచించిన జాన్వి కపూర్ RRR తర్వాత తారక్ క్రేజ్ చూసి టైగర్ తో జోడీ కట్టేందుకు ఓకే చెప్పింది. కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న దేవర సినిమాతో జాన్వి అదరగొట్టాలని ఫిక్స్ అయ్యింది. మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయాలని అనుకున్నా దేవర టీం కాదని చెప్పడంతో ఆ ప్రయత్నాన్ని వెనక్కి తీసుకున్నారు.

తెలుగులో జాన్వి ఎంట్రీ దేవరతోనే జరగాలని ఎన్.టి.ఆర్ అండ్ టీం ఫిక్స్ అయ్యింది. ఐతే మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమా రిజల్ట్ చూశాక ఆ సినిమా తెలుగులో రిలీజ్ చేయకపోవడమే బెటర్ అని అనుకున్నారు. ప్రస్తుతం జాన్వి ఫోకస్ అంతా దేవర మీద ఉంది. ఈ సినిమాతో ఎలాగైనా పాన్ ఇండియా వైడ్ గా హిట్ కొట్టాలని చూస్తుంది అమ్మడు. దేవర పూర్తి కాకుండానే రాం చరణ్ తో సినిమా లాక్ చేసుకుంది జాన్వి కపూర్.

బుచ్చి బాబు డైరెక్షన్ లో వస్తున్న చరణ్ సినిమా కూడా జాన్వి కెరీర్ కి హెల్ప్ అవుతుందని అంటున్నారు. దేవర, RC16 రెండు సినిమాలతో జాన్వి టాలీవుడ్ లో తన ఇంపాక్ట్ చూపించాలని చూస్తుంది. మరి బాలీవుడ్ లో హిట్ ట్రాక్ తప్పిన జాన్వి తెలుగు పాన్ ఇండియా సినిమాలతో ట్రాక్ ఎక్కుతుందేమో చూడాలి. మరి జాన్వి కపూర్ లక్ ఎలా ఉందో ఈ రెండు సినిమాలతో తెలుస్తుంది. శ్రీదేవి తనయురాలు తెలుగు ఎంట్రీ అనగానే శ్రీదేవిని ఇష్టపడే అభిమానులంతా జాన్వి సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. వారిని సాటిస్ఫై చేసేలా జాన్వి అభినయం చూపిస్తుందా లేదా అన్నది కూడా చూడాలి.

Tags:    

Similar News